వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరానికి బెయిల్.. అయినా కస్టడీలోనే: మరో 48 గంటల పాటు తీహార్ జైలులో విచారణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి బెయిల్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు, పాస్ పోర్టును స్వాధీనం చేయాలని షరతులు విధించింది. బెయిల్ లభించినప్పటికీ..ఇంకా విచారణలోనే కొనసాగాల్సి వస్తోంది చిదంబరానికి. కారణం.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో ఆయన బెయిల్ లభించలేదు. ఫలితంగా గురువారం వరకు ఆయన తీహార్ జైలులోనే కొనసాగాల్సి ఉంటుంది.

మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు..?మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు..?

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్..

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్..

ఐఎన్ఎక్స్ మీడియాలో 310 కోట్ల రూపాయల మేర దుర్వినియోగం చోటు చేసుకున్న ఘటనలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఈడీ అధికారులు చిదంబరంపై వేర్వేరుగా కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. తీహార్ జైలులో ఉంటూ ఆయన సీబీఐ, ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో బెయిల్ కోసం చిదంబరం దాఖలు చేసుకున్న పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసి పుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ చిదంబరం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటీషన్ ను దాఖలు చేశారు. దీన్ని ఇదవరకే విచారణకు స్వీకరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం.

రెండు నెలలుగా విచారణ.. సాక్ష్యాధారాలేవీ?

రెండు నెలలుగా విచారణ.. సాక్ష్యాధారాలేవీ?

మంగళవారం ఉదయం ఈ పిటీషన్ పై విచారణ చేపట్టింది. పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల చిదంబరానికి బెయిల్ మంజూరు చేయడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేయగలరని, సాక్ష్యులను ప్రభావితం చేయగలరని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. కీలక మైన కేసు అయినందు వల్ల బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. దీనిపై చిదంబరం తరఫు న్యాయవాది వాదిస్తూ.. రెండు నెలలకు పైగా చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇన్ని రోజులైనప్పటికీ.. ఒక్క సరైన సాక్ష్యాధారాలను కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకోలేకపోయారని వాదించారు.

షరతులతో కూడిన బెయిల్..

షరతులతో కూడిన బెయిల్..

ఇరు పక్షాల వాదోపవాదాలను విన్న తరువాత సుప్రీంకోర్టు.. చిదంబరం తరఫు న్యాయవాదితో ఏకీభవించారు. రెండు నెలల కాలంలో సీబీఐ అధికారులు సరైన సాక్ష్యాధారాలను ఎందుకు సేకరించలేకపోయారని ప్రశ్నించింది. దీనిపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయార సీబీఐ తరఫు న్యాయవాది. దీనితోో- చిదంబరానికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది సుప్రీంకోర్టు. లక్ష రూపాయల పూచీకత్తు, పాస్ పోర్టును స్వాధీనం చేయాలని ఆదేశించింది. బెయిల్ సమయంలో దేశం విడిచి వెళ్లరాదని సూచించింది.

 ఈడీ కస్టడీలోనే చిదంబరం..

ఈడీ కస్టడీలోనే చిదంబరం..

కాగా- ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనే ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కారణంగా చిదంబరం గురువారం వరకూ తీహార్ జైలులోనే కొనసాగాల్సి ఉంటుంది. గురువారం నాటికి ఈడీ కస్టడీ ముగుస్తుంది. కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ అధికారులు రోజ్ వేలీ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కస్టడీని పొడిగించాలా? వద్దా? అనే విషయంపై రోజ్ వేలీ న్యాయస్థానం తీసుకునే నిర్ణయం మీదే చిదంబరం బయటికి రాగలుగుతారా? లేదా? అనేది ఆధార పడి ఉంది. కస్టడీని పొడిగించకపోతే.. ఆ వెంటనే- చిదంబరం తీహార్ జైలు నుంచి బయటికి రాగలుగుతారు.

English summary
The Supreme Court, on Tuesday, granted bail to former finance minister P Chidambaram in the INX Media case. A bench of Supreme Court justices R Banumathi, AS Bopanna and Hrishikesh Roy granted bail to Chidambaram, who has been in the CBI custody. The court had reserved the order on October 18. The senior Congress leader had filed a plea challenging the Delhi High Court order dismissing his bail plea. the verdict, however, may not come as a relief to Chidambaram who is also in the custody of the Enforcement Directorate (ED) till October 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X