మరికాసేపట్లో అయోధ్య భూ వివాదంపై సుప్రిం విచారణ
అయోధ్య భూవివాదం కేసుకు సంబంధించి ఫుల్స్టాప్ పెట్టేందుకు సమయం ఆసన్నమైంది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయా ప్రకంపణలు రేపుతున్న వివాదంపై సుప్రిం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే మధ్యవర్తుల కమిటి రూపోందించిన నివేదికను సుప్రిం కోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
అయోధ్య వివాదంపై పరిష్కరం కనుగునేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటిని గత మార్చి 8న సుప్రిం కోర్టు నియమించింది. ఈ నేపథ్యంలోనే కమిటి రిపోర్టును గురువారం సీల్డు కవర్లో అందించింది. కాగా ముగ్గురు కమీటి సభ్యుల ప్యానల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ రవిశంకర్ ,సుప్రిం కోర్టు మాజీ జడ్జి ఖలీఫుల్లా, మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు ఉన్నారు.
కాగ రామమందిరం భూ వివాదంపై ఆలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మొత్తం 14 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. అలహాబాదు ఇచ్చిన కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భూమిని మూడు బాగాలుగా విభజించింది. దీంతో ఆ తీర్పు వ్యతిరేకంగా పిటిషన్లు ధఖాలయ్యాయి. ఇక బాబ్రి మసీదును డిశంబర్ 6 1992న కూల్చిన విషయం తెలిసిందే..