వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాచకులపై నిషేధం విధించలేం: కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు, కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భిక్షాటన చేసేందుకు ఎవరూ ఇష్టపడరని, పేదరికమే ఆ పరిస్థితి కల్పిస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనావైరస్ మహమ్మారి వేళ బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిసేధం విధించడం కుదరదని స్పష్టం చేసింది. యాచకులకు కరోనా వ్యాక్సిన్లు అందించడంతోపాటు పునరావాసం కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించింది.

అంతేగాక, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా విజృంభిస్తున్న వేళ యాచకులు ట్రాఫిక్ జంక్షన్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటన చేయడాన్ని అడ్డుకుని, వారికి పునరావాసం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది.

 Supreme Court notice to Centre, Delhi govt on plea for vaccination of beggars, refuses to ban begging at public places amid pandemic

పేదరికమే లేకపోతే ఎవరూ భిక్షాటన చేయాలని కోరుకోరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్య, ఉపాధి లేకపోవడంతోనే కనీస జీవనం కోసం వారు యాచించాల్సి వస్తోందని పేర్కొంది.

ఇదొక సామాజిక-ఆర్తిక సమస్య అని పేర్కొంది. కరోనా మహమ్మారి వ్యాప్తి వేళ బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనను నిసేధించలేదమని సుప్రీంకోర్టు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

English summary
Supreme Court notice to Centre, Delhi govt on plea for vaccination of beggars, refuses to ban begging at public places amid pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X