Same Sex Marriage: స్వలింగ వివాహాల చట్టబద్ధతపై పార్లమెంట్లో చర్చ జరగాలి: సుప్రీం
స్వలింగ వివాహాని(Same Sex Marriage)కి చట్టబద్ధతపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గత వారం రోజులుగా విచారణ చేస్తోంది. భారత్ లో స్వలింగ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల అశ్లీలతతో సహా ఇతర సామాజికంగా అంగీకరించని సంబంధాలు పెరిగే అవకాశం ఉందని కేంద్రం వాదించింది. కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదానలు వినిపించారు.
ఈ నిషేధిత సంబంధాల ఎక్కడి నుంచి వచ్చాయని, అవి హిందూ చట్టం నుంచి వచ్చినవేనని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. లైంగిక ధోరణి ఇలా జరుగుందని చెబుతున్నారని... లైంగిక ధోరణి ద్వారా స్వయంప్రతిపత్తికి అర్హుడని స్వలింగ సంపర్కులు చెబుతున్నారని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. మెహతా స్పందిస్తూ దీనిపై రెండు భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. శృంగార ధోరణి కూడా పొందగలదని ఒకరు చెప్పారని. మరొకరు ఇది అంతర్నిర్మితమని చెప్పారని.. ఇప్పుడు మనం దానిలోకి వెళ్లవద్దని వాదించారు.

స్వలింగ జంటలకు ప్రాథమిక సామాజిక హక్కులను కల్పించే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుక్కోవాలని ధర్మసనం సూచించింది. గే జంటలకు ఉమ్మడి బ్యాంక్ అకౌంట్లు కల్పించడం, లేదా బీమా పాలసీల్లో భాగస్వామిని నామినేట్ చేసే అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేగాక స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత అంశంపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగడమే కీలకమని చెప్పింది. దీనిపై తదుపరి విచారణ తేదీలోగా నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

కాగా వివాహ వ్యవస్థ వంటి ముఖ్యమైన అంశంపై దేశ ప్రజలే నిర్ణయం తీసుకోగలరని న్యాయ మంత్రి కిరణ్ రిజిజు నిన్న అన్నారు. "ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన విషయం. ఇది ప్రజల అభీష్టానికి సంబంధించిన ప్రశ్న. ప్రజల సంకల్పం పార్లమెంటు లేదా శాసనసభ లేదా అసెంబ్లీలలో ప్రతిబింబిస్తుంది" అని కిరణ్ రిజిజు చెప్పారు












Click it and Unblock the Notifications