వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామజన్మభూమి వివాద పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీ: 8 వారాల గడువు..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దశాబ్దాల కాలంగా న్యాయస్థానంలో నలుగుతూ వస్తోన్న అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలనేది కూడా సుప్రీంకోర్టే ఖరారు చేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక వేత్త పండిట్ శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులను నియమించింది. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై మధ్యవర్తిత్వాన్ని వహిస్తుంది.

<strong>మొట్ట‌మొద‌టి హెచ్ఐవీ క్లినిక్ః అలాంటి వారికి మాత్ర‌మే ప్ర‌వేశం..ఇత‌రులు నిషిద్ధం</strong>మొట్ట‌మొద‌టి హెచ్ఐవీ క్లినిక్ః అలాంటి వారికి మాత్ర‌మే ప్ర‌వేశం..ఇత‌రులు నిషిద్ధం

మధ్యవర్తిత్వమే ఎందుకంటే

మధ్యవర్తిత్వం ద్వారా రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల రెండు వర్గాల ప్రజలకు కూడాఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంచనా వేశారు. మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపులు అత్యంత గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ కేంద్రంగా ఈ కమిటీ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది.

Supreme Court Orders Mediation In Ayodhya Case

నాలుగు వారాల్లోగా మధ్యంతర నివేదికను, ఎనిమిది వారాల్లోగా పూర్తిస్థాయి నివేదికను రూపొందించాల్సి ఉంటుంది. మధ్యవర్తిత్వం వహించడం ద్వారా వచ్చిన అభిప్రాయానలను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో ద్వారా రికార్డు చేయాలని సూచించింది. అవసరం అనుకుంటే మధ్యవర్తిత్వ కమిటీ న్యాయ సేవలను పొందవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.

English summary
The Supreme Court Constitution Bench on Friday, 8 March, referred Ram Janmabhoomi-Babri Masjid land dispute case for a monitored mediation for a “permanent solution”. The apex court appointed Justice FMI Kalfullah, Sri Sri Ravi Shankar, and senior advocate Sriram Panchu as mediators.The mediation will be held in Uttar Pradesh’s Faizabad. “Mediation proceedings will be confidential,” said CJI, adding that media will be banned from reporting on it. The court added that the mediation will be held on-camera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X