వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించే బిల్లుపై కేంద్రానికి నోటీసులు : సుప్రిం కోర్టు

|
Google Oneindia TeluguNews

కేంద్రం ఇటివల ఆమోదించిన యూఏపీఏ చట్టాన్ని సవాలు చేస్తూ నమోదైన పిటిషన్‌ను సుప్రిం కోర్టు స్వీకరించింది. పిటిషన్‌‌ను విచారించేందుకు కేంద్రానికి నోటీసులు దాఖలు చేసింది. ఇక ఈ చట్టం ప్రకారం తీవ్రవాద కార్యకలాపాలతోపాటు సంఘవ్యతిరేక శక్తులను తీవ్రవాదులుగా ప్రకటించనున్నారు. ఈ చట్టం ప్రకారం ప్రజలు తమ నిరసనను, అసంతృప్తిని తెలియ చేసే హక్కును ఈ చట్టం కాలరాస్తుందని పిటిషనర్ పేర్కోన్నారు.ముఖ్యంగా తీవ్రవాద కార్యకలాపాల పేరుతో వ్యక్తులను నిర్భంధించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కోన్నారు.

వివాదాలకు కేరాఫ్ : జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూతవివాదాలకు కేరాఫ్ : జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత

కేంద్రం తెచ్చిన చట్టంపై ఓ ఎన్జీవో ఆర్గనైజేషన్ తోపాటు సాజల్ ఆవాస్తి అనే పౌరుడు సుప్రిం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.దీంతో పిటిషన్‌ స్వీకరించిన సుప్రింకోర్టు చీఫ్ జస్టీస్ రంజన్‌ గగోయ్‌తో పాటు జస్జీస్ అశోక్ భూషన్‌లు కేంద్రానికి నోటీసులు జారీ చేశారు.పౌరులకు రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును ఈ చట్టం నిరోధిస్తుందని, టెర్రరిస్టుగా ముద్రపడిన వ్యక్తి అరెస్ట్‌ కాకుండా తనను తాను సమర్ధించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పించడం లేదని పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Supreme Court sends notice to Centre to hear plea against amended anti-terror law,

మోడీ సర్కారు కీలక బిల్లుకు ఆగస్టు2న పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకుంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో కీలక చర్చ అనంతరం ఒటింగ్ కూడ జరిగింది. దీంతో 147 మంది అనుకూలంగా 42 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఉగ్రవాదానికి మతం లేదని మానవాళికకి ఉగ్రవాదులు వ్యతిరేకమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దీంతో యూఏపీఏ సవరణ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్ వీగిపోయింది. ఈ ప్రతిపాదనకు 104 మంది సభ్యులు వ్యతిరేకంగా, 85మంది అనుకూలంగా ఓటు వేశారు.

English summary
The Supreme Court on Friday issued a notice to Centre on a plea challenging the amended anti-terror law that empowers the government to designate an individual as terrorist. This case comes days after the government, using the law, declared Jaish chief Hafiz Saeed and underworld don Dawood Ibrahim, among others, as terrorists
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X