వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై మరోసారి వాదనలు ... రివ్యూ పిటిషన్‌లపై సుప్రీం కోర్టు విచారణ

|
Google Oneindia TeluguNews

అయోధ్య వివాదంలో దాఖలైన రివ్యూపిటిషన్‌లపై తేల్చేందుకు సుప్రీం కోర్టు సన్నద్దమైంది. అయోధ్య తీర్పుపై దాఖలైన మొత్తం రివ్యూపిటిషన్‌లపై విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఇందుకోసం ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ ఏ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పిటిషన్‌లపై గురువారం విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించాయి.

సుప్రీం కోర్టు మాజీ ప్రధాని న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో విచారణ చేపట్టి తీర్పును వెలువరించిన అయోధ్య వివాదం కేసు మరోసారి సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో అయోధ్య నిర్మాణానికి మరికొంత కాలం బ్రేకులు పడనున్నాయి. తీర్పు తర్వాత రివ్యూ పిటిషన్‌కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే ముస్లిం పర్సనల్ లాబోర్డుతో పాటు సుమారు 40 మంది వ్యక్తిగతంగా రివ్యూ పిటీషన్లు దాఖలు చేశారు. ఇందులో అయోధ్య వివాదంపై పోరాడిన హిందూ సంస్థ అయిన నిర్మోహి అఖాడా కూడ రివ్యూ పిటిషన్ ధాఖలు చేశారు. దీంతో వీటన్నింటిని విచారించేందుకు సుప్రిం కోర్టు ముందుకు వచ్చింది.

 Supreme Court will hear petitions of its Ayodhya verdict on Thursday

కాగా అయోధ్య వివాదంపై నవంబర్ తొమ్మిదిన జస్టీస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం నలబై రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును వెలువరించింది. భూ వివాదానికి సంబంధించి మొత్తం 2.77 ఎకరాల భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగిస్తూ.. తీర్పు వెలువరించింది. అనంతరం మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తీర్పుపై పలు రివ్యూ పిటిషన్‌లు దాఖలు అయ్యాయి.

English summary
The Supreme Court will hear on Thursday petitions seeking a review of its landmark verdict on the Ayodhya land dispute case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X