ఉన్నావో అత్యాచారం ...అత్యవసరంగా కేసును విచారించనున్న సుప్రిం కోర్టు
ఉన్నావో ప్రమాదంపై సుప్రిం కోర్టు స్పందించింది. అంతకుముందే ఎమ్మెల్యే నుండి ప్రాణహని ఉందని భాదితురాలు సుప్రిం కోర్టుకు లేఖ రాసిన నేపథ్యలోనే దానిపై సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్గగోయ్ సిరియస్గా స్పందించారు. సంఘటనకు సంబంధించి కేసును విచారణ చేపట్టేందుకు లిస్టులో చేర్చారు. మరోవైపు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను రేపటిలోగా కోర్టుకు సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.
ఉన్నావో అత్యచార భాదితురాలి ప్రమాదానికి సంబంధించి సుప్రిం కోర్టు రంగంలోకి దిగింది. ప్రమాదానికి ముందే బాధితురాలు సుప్రిం కోర్టుకు ఓ లేఖ రాసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోదరుడు మనోజ్ సింగ్, కన్నుమిశ్రా ఎమ్మెల్యే కొడుకు నవీన్ సింగ్లతో పాటు మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జూలై 7న భాదితురాలి ఇంటికి వచ్చి బెదిరించారని, ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు బెయిల్ వచ్చేందుకు జడ్జీలను కొనుగోలు చేసే అవకాశం ఉండడంతోపాటు కేసును తప్పుుదోవ పట్టించనున్నారని లేఖలో పేర్కోంది. కాగలేఖలో ముగ్గురు మహిళలు సంతకాలు పెట్టి పంపారు. అయితే లేఖలో సంతకాలు పెట్టిన ఒక మహిళ ప్రమాదంలో అనూహ్యంగా మృతిచెందింది.
ఈ నేపథ్యంలోనే భాదితురాలు రాసిన లేఖను అత్యవసరంగా విచారించేందుకు ముందుకు వచ్చింది. ఈ సంధర్భంగా రంజన్ గగోయ్ స్పందిస్తూ కేసుపై నిర్మాత్మకమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కేసుకు సంబంధించి అమికస్ క్యూరిగా వీ.గిరి అనే సీనియర్ న్యాయవ్యాదిని నియమించారు.