వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సీజేఐపై కుట్ర విచారణకు సుప్రీం కమిటీ
ఢిల్లీ : సీజేఐ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో కుట్ర కోణంపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. సీబీఐ, ఐబీ విభాగం డైరెక్టర్లతో పాటు ఢిల్లీ పోలీసు కమిషనర్లు విచారణకు సహకరించాలని సూచించింది.
సీజేఐ కేసు నుంచి తప్పుకున్న జస్టిస్ రమణ
సీజేఐపై కుట్ర పన్నుతున్నారని అడ్వకేట్ ఉత్సవ్ బైన్స్ దాఖలు చేసిన అఫిడవిట్పై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ అవసరమని అభిప్రాయపడింది. జస్టిస్ పట్నాయక్ ఇన్ హౌజ్ విచారణలో జోక్యం చేసుకోరని కోర్టు స్పష్టం చేసింది. విచారణ అనంతరం ఆయన సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
English summary
The Supreme Court today ordered a probe headed by retired judge Justice AK Patnaik into lawyer Utsav Singh Bains's claims of a conspiracy to discredit Chief Justice of India Ranjan Gogoi with sex harassment allegations. The top court, though, made it clear that Justice Patnaik will not look into the allegations against the Chief Justice which is being looked into by an in-house panel.
Story first published: Thursday, April 25, 2019, 16:35 [IST]