వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలేషియాలో భారత ఫ్యామిలీ కష్టాలు: వెంటనే సాయమందించిన సుష్మా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా.. వెంటనే వారికి సాయమందించడంలో ముందుంటున్నారు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. తాజాగా, మ‌లేషియాలో పాస్‌పోర్ట్ పోగొట్టుకుని ఇబ్బంది ప‌డిన ఓ భార‌తీయ కుటుంబానికి స‌హాయం చేసి మ‌రోసారి ప్రశంసలు అందుకున్నారు.

వారాంతం సంద‌ర్భంగా మ‌లేషియాలో భార‌త దౌత్య కార్యాల‌యం మూసి ఉండ‌టంతో పాస్‌పోర్టులు పోగొట్టుకున్న భార‌తీయ కుటుంబం ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. త‌మ కుటుంబం గురించి సుష్మాకు తెలియ‌జేస్తూ మీరా ర‌మేశ్ ప‌టేల్ అనే మ‌హిళ‌ ఓ ట్వీట్ చేసింది.

వారాంతం సంద‌ర్భంగా మ‌లేషియాలో భార‌త దౌత్య కార్యాల‌యం మూసి ఉండ‌టంతో పాస్‌పోర్టులు పోగొట్టుకున్న భార‌తీయ కుటుంబం ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. త‌మ కుటుంబం గురించి సుష్మాకు తెలియ‌జేస్తూ మీరా ర‌మేశ్ ప‌టేల్ అనే మ‌హిళ‌ ఓ ట్వీట్ చేసింది.

ఆ ట్వీట్‌కు వెంట‌నే స్పందించిన సుష్మా స్వరాజ్... 'ఇది చాలా అత్య‌వ‌స‌ర విష‌యం.. ద‌య‌చేసి దౌత్య కార్యాల‌యాన్ని తెరిచి భార‌తీయ కుటుంబానికి స‌హాయం చేయండి' అంటూ మ‌లేషియాలోని భార‌త దౌత్య‌ కార్యాల‌యాన్ని సుష్మా స్వ‌రాజ్ ట్వీట్ ద్వారా ఆదేశించారు. కాగా, ఆ వెంటనే సదరు భారతీయ కుటుంబానికి స‌హాయం చేసి, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన‌ట్లుగా భార‌త దౌత్య‌కార్యాల‌యం నుంచి సమాధానం వచ్చింది.

English summary
External Affairs Minister Sushma Swaraj on Saturday asked the Indian embassy in Kuala Lumpur to help an Indian family get their travel documents, despite the mission being closed on weekends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X