టర్కీలో కేరళ యువకుడి మకాం, ఐఎస్ లోకి యువకులు, అమెరికా చెప్పింది, ఢిల్లీలో !
విదేశాల్లో కుర్చుని గుట్టుచప్పుడు కాకుండా కేరళకు చెందిన యువకులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలోకి లాగుతున్నాడని ఆరోపిస్తూ కేరళకు చెందిన ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ: విదేశాల్లో కుర్చుని గుట్టుచప్పుడు కాకుండా కేరళకు చెందిన యువకులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలోకి లాగుతున్నాడని ఆరోపిస్తూ కేరళకు చెందిన ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని కణ్ణూరుకు చెందిన షాజహాన్ వెల్లూరు (32) అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేశారు.
షజహాన్ వెల్లూరు గత ఫిబ్రవరి నెలలో టర్కీ వెళ్లాడు. తరువాత అక్కడే మకాం వేసిన షజహాన్ వెల్లూరు కేరళలోని యువకులను సంప్రధిస్తున్నాడు. నిరుద్యోగులు, ఉగ్రవాదంపై ఆసక్తి ఉన్న యువకులను రెచ్చగొట్టి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)లో చేరాలని ప్రోత్సహిస్తున్నాడు.
టర్కీ నుంచి షాజహాన్ భారత్ బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న యూస్ (అమెరికా) ఇంటిలిజెన్స్ ఏజెన్సీ అధికారులు వెంటనే ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేశారు. బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టిన షాజహాన్ వెల్లూరును పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఎంత మందిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేర్చించాడు అంటూ ఆరా తీస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.