ఆ ఊరిలో ఒక్క ముస్లీం లేడు, హిందువులే మొహరం, బళ్లారి దేవత, మైసూరు రాజులు !
బెంగళూరు: ఆ ఊరిలో ఒక్క ముస్లీం కుటుంబం లేదు. అయినా ముస్లీం సోదరులు జరుపుకునే మొహరం పండుగ హిందువులు జరుపుకుంటున్నారు. మాకు మతాలు, కులాలు అడ్డురావని ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో హిందువులు మొహరం పండుగ చేస్తున్నారు. బళ్లారి గ్రామ దేవత, మైసూరు మహారాజుల పోరాటంకు సాక్షి ఆ గ్రామం.
దూల తీరింది, బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రూ. లక్షలు వసూలు చేశారంటే!
మండ్య పట్టణానికి ఒక్క కిలో మీటరు దూరంలో తడగవాడి అరెకరె గ్రామం ఉంది. అరకెరె గ్రామానికి చుట్టు పక్కల సుమారు 30కి పైగా గ్రామాలు ఉన్నాయి. అక్కడి బాషకు ప్రత్యేకత ఉంది. అక్కడి మనుషులు ఎక్కువగా ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారు. అది హిందువుల పండుగ అయినా సరే, ముస్లీంల పండుగ అయినా సరే అందరూ ఒక్కటిగా ముందు ఉండి జరుపుకుంటారు. కానీ ఆ గ్రామంలో ఒక్క ముస్లీం కుటుంబం లేదు.
మండ్యలో బళ్లారి అనే ఇంటి పేరుతో వందల మంది ఉన్నారు. ఇక్కడ బళ్లారి అమ్మవారి దేవాలయం ఉంది. మండ్య జిల్లాలో ఈ ఊరి ప్రజలే ఎక్కువగా బళ్లారి గ్రామ దేవత ఆలయాలు నిర్మించారు. ఇదే ప్రాంతంలో బ్రిటీష్ సైనికులతో మైసూరు మహా సామ్రాజ్యం సైనికులు యుద్దం చేశారు.
ఐఏఎస్ అధికారి రాజీనామా, పాకిస్థాన్ వెళ్లిపో, పోరాటం చేస్తావా ? అదే నీకు కరెక్ట్, బీజేపీ ఎంపీ!
ఈ గ్రామ ప్రజలు బిట్రీష్ సైనికులను పట్టుకుని మాకు అప్పగించారని అప్పటి మైసూరు మహారాజు కృష్ణరాజ ఒడయార్ చెప్పారు. అంతటి చరిత్ర ఉన్న ఈ ఊరిలో ఈ రోజు ఒక్క ముస్లీం సోదరుడు లేకపోయినా మొహరం పండుగ చేస్తున్నారు. హిందూ, ముస్లీంలకు చెందిన ఏ పండుగ అయినా ఇక్కడి ప్రజలు సంతోషంగా జరుపుకుంటారు.