తాజ్ హోటల్కు బాంబు బెదిరింపులు: పాక్ లష్కరే తోయిబా ఉగ్రవాది పనే
ముంబై: ప్రఖ్యాత తాజ్ హోటల్కు పాకిస్థాన్ నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం అర్థరాద్రి 12.30 గంటలకు కాల్ చేసిన ఆగంతకుడు బాంబులతో హోటల్ను పేల్చివేస్తామంటూ బెరింపులకు పాల్పడినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.
Coronavirus: హోటల్ లో కరోనా క్వారంటైన్, బాత్ రూంలో మీనాక్షి, కుప్పకూలిన సీలింగ్, అంతే !
ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ హోటల్ తోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాకిస్థాన్లోని కరాచీ నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆగంతకుడు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
కోలాబాలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, బాంద్రాలోని తాజ్ లాండ్స్ ఇండ్ హోటల్లకు ఈ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలిపారు. కాల్ చేసిన ఆగంతకుడు తనకు తానే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడిగా చెప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Recommended Video
కాగా, 2008 నవంబర్ 26న ముంబై తాజ్ హోటల్పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 166 మంది ప్రజలు మృతి చెందారు. 300 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడికి కుట్ర పన్నారు.