జూమ్ ఇండియా: ఇలాంటి వారికోసమే ఈ టాలెంట్ హంట్, జాబ్ ఫెయిర్
జాతీయ స్థాయి టాలెంట్ హంట్ - జూమ్ ఇండియా కార్యక్రమానికి ఒడిషా ప్రభుత్వం నేతృత్వంలోని ఎస్ఎస్ఈపీడీ శాఖ, కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఎమ్ఎస్జేఈలు సహకరిస్తున్నాయి. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని భువనేశ్వర్లోని శాంతిధమ్ ఫౌండేషన్ సమర్పిస్తోంది. ఇది జాతీయ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగి ఉంది. భారత దేశంలో దాదాపు 315 సంస్థలతో శాంతిధమ్ ఫౌండేషన్ జతకట్టింది.
కార్యక్రమంలోని హైలైట్స్
* ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన నైపుణ్యత కలిగిన చిన్నారులు అధికసంఖ్యలో పాల్గొంటారు.
* టాలెంట్ ప్రదర్శించిన విజేతలకు, రన్నర్అప్గా నిలిచిన వారికి ముఖ్య అతిథి సత్కరిస్తారు.
* శాంతిధమ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ జాబ్ ఫెయిర్ నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారుల నైపుణ్యంను గుర్తించేందుకు మంచి వేదికగా నిలుస్తుంది
* జాతీయ స్థాయి పత్రిక "సమర్థ్"లో వీరి స్ఫూర్తిదాయక కథనాలను ప్రచురించి దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది
* ఈ కార్యక్రమంలో చిన్నారులు డ్యాన్స్, పాటలు, స్పీడ్ పెయింటింగ్, నటన మరియు మిమిక్రీలలో తమ ప్రతిభను, నైపుణ్యతను చాటుతారు
* మొత్తంగా సమాజంలో దివ్యాంగులు వేరుకాదని వారు కూడా ఇందులో భాగమే అని చెప్పేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం. అందుకే జూమ్ ఇండియా పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులను ప్రోత్సహించడం జరుగుతుంది
* విజేతల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం 8 నవంబర్ 2019న సాయంత్రం 6 గంటలకు భువనేశ్వర్లోని రైల్వే ఆడిటోరియంలో జరుగుతుంది.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చే చిన్నారుల్లోని టాలెంట్ను వెలికి తీసి ప్రపంచానికి చాటేందుకు జూమ్ ఇండియా నడుం బిగించిందని ప్రోగ్రాం కోఆర్డినేటర్ తెలిపారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారని తెలిపారు. పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు, బోధనా సిబ్బంది, స్టాఫ్ మెంబర్స్ కూడా హాజరుకానున్నట్లు చెప్పారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, చిన్న స్థాయి పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నట్లు కోఆర్డినేటర్ వివరించారు.