ఇప్పుడు ఐపీఎల్ అవసరమా?:ధోనీ టీంకు రజనీకాంత్ సూచన, మోడీకి వార్నింగ్, కావేరీపై హీరోల దీక్ష
చెన్నై: ఓ వైపు రాష్ట్రంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే, రైతుల కోసం పోరాడే సమయంలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) జరగడం ఇబ్బందికరమని నటుడు రజనీకాంత్ అన్నారు. కావేరీ నదీ జలాల కోసం నిరసన తెలియజేస్తున్న సమయంలో ఐపీఎల్ పోటీలు ఏమిటన్నారు.
#WATCH Rajinikanth and Kamal Hassan take part in protest over demand for formation of #CauveryMangementBoard, in Chennai. Music composer Ilayaraja also present. pic.twitter.com/JhIxGxp1QO
— ANI (@ANI) April 8, 2018
ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ పోటీలు తనకు ఇబ్బందిని, చిరాకును తెప్పిస్తున్నాయన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు, అభిమానులు కావేరీ నీటి కోసం, ప్రజల ఆందోళనకు మద్దతుగా నల్ల బ్యాడ్జిలు ధరించి మ్యాచులు ఆడాలని విజ్ఞప్తి చేశారు.
కావేరీ బోర్డు ఏర్పాటు చేయకుంటే తమిళ ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని రజనీకాంత్ అన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు.
Chennai: Tamil actors Vijay, M. Nassar and Vishal take part in protest over #Cauvery issue. pic.twitter.com/OhZgirdvMf
— ANI (@ANI) April 8, 2018
మరోవైపు, ఏప్రిల్ 11న కావేరీ జలాల కోసం పీఎంకే బందుకు పిలుపునిచ్చింది. దీనికి డీఎంకే మద్దతు తెలిపింది.
Chennai: Rajinikanth, Kamal Hassan and Dhanush take part in protest over demand for formation of #CauveryMangementBoard pic.twitter.com/HCY7RTiGLv
— ANI (@ANI) April 8, 2018
కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని తమిళనాడులో ఆయా పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా సినిమా పరిశ్రమ కూడా ముందుకు వచ్చింది. నటులు విజయ్, సూర్య, విశాల్, నాజర్, సత్యరాజ్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్లు ఈ దీక్షకు మద్దతు పలికారు.