జల్లికట్టులో విషాదం: చూడ్డానికి వస్తే మృత్యువు తరుముకొచ్చింది
మదురై: జల్లికట్టు క్రీడ సందర్భంగా ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులోని మదురై జిల్లా పలమేడులో చోటు చేసుకుంది. జల్లికట్టులో భాగంగా జరరిగే జరిగే కోడెగిత్తల క్రీడను చూడడానికి వచ్చిన 19 ఏళ్ల యువకుడిని మృత్యువు తరుముకొచ్చింది
ఈ జల్లికట్టులో దాదాపు 25 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని ఎస్ కాళిముత్తుగా గుర్తించారు. అతను దిండిగుల్ జిల్లా శనర్పట్టికి చెందినవాడు.
Recommended Video
ఈ జల్లికట్టులో మొత్తం 458 కోడెగిత్తలు పాల్గొన్నాయి. కోడెగిత్తల నమోదుకు ఆధార్ అనివార్యమంటూ మదురై జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వివాదం చోటు చేసుకుంది.
ఆదివారంనాడు 79 మంది గాయపడ్డారు. వారిలో జల్లికట్టును చూడడానికి వచ్చినవారు కూడా ఉన్నారు. ఈ జల్లికట్టు ఏడాది తొలిగా మదురై జిల్లాలోని అవనియాపురంలో జరిరగింది