కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, 200 పేజీలు, లేడీ ప్రొఫెసర్ కేసు, ఆడియో!
చెన్నై: కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని వ్యభిచారకూపంలోకి లాగడానికి ప్రయత్నించి అరెస్టు అయిన తమిళనాడు లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవీ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది. కేసు విచారణ చేస్తున్న సీబీసీఐడీ అధికారులు 200 పేజీలకుపైగా చార్జ్ షీట్ తయారు చేసి కోర్టులో సమర్పించారు.
డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు లేడీ ప్రొఫెసర్ సెక్స్ పాఠాలు: హైకోర్టు డెడ్ లైన్, బెయిల్!
తమిళనాడులోని అరుప్పుకోటైలోని కాలేజ్ లో ప్రొఫెసర్ గా పని చేసిన నిర్మలా దేవి అదే కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పింది. మదురై కామరాజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ల లైంగికవాంచ తీర్చాలని కాలేజ్ అమ్మాయిల మీద ఒత్తిడి చేసింది.
రహస్యంగా ఉంటుంది
మదురై కామరాజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ల లైంగిక వాంచ తీర్చితే పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తారని, ప్రతిఫలంగా మీ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేస్తారని, ఈ విషయాలు రహస్యంగానే ఉంటాయని నిర్మలా దేవి కాలేజ్ అమ్మాయిలకు చెప్పింది.
అమ్మాయిలకు వార్నింగ్
మదురై కామరాజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్లు చెప్పినట్లు వినకుంటే పరీక్షల్లో మిమ్మల్ని ఫెయిల్ చేసే అవకాశం ఉంటుందని నిర్మలా దేవి పరోక్షంగా కాలేజ్ విద్యార్థులను బెదిరించారు. నిర్మలా దేవి చెప్పినట్లు వినడానికి కొందరు కాలేజ్ అమ్మాయిలు నిరాకరించారు.
ఆడియో వైరల్
మదురై కామరాజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ల లైంగిక కొరిక తీర్చాలని కాలేజ్ అమ్మాయిల మీద నిర్మలా దేవి ఒత్తిడి చేసిన ఆడియో టేప్ లు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
నిర్మలా దేవికి పరీక్షలు
తమిళనాడు ప్రభుత్వం నిర్మలా దేవి వ్యవహారంపై విచారణ చెయ్యాలని సీబీసీఐడికి ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు గవర్నర్ సైతం విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నిర్మలా దేవికి ప్రయోగశాలలో వాయిస్ టెస్టింగ్ పరీక్షలు నిర్వహించారు.
మేడమ్ కథ చిన్నది కాదు
నిర్మలా
దేవితో
పాటు
మదురై
కామరాజర్
యూనివర్శిటీ
ప్రొఫెస్
మురుగన్,
స్కాలర్
విద్యార్థి
కరుప్పుస్వామిని
ఇప్పటికే
అరెస్టు
చేశారు.
కాలేజ్
అమ్మాయి,
అక్కడ
పని
చేస్తున్న
ఉద్యోగులు,
బాధితుల
నుంచి
వివరాలు
సేకరించిన
సీబీసీఐడి
అధికారులు
200
పేజీలకు
పైగా
చార్జ్
షీట్
తయారు
చేసి
న్యాయస్థానంలో
సమర్పించారు.
నిర్మలా
దేవి
కేసు
విచారణ
సెప్టెంబర్
10వ
తేదీ
లోపు
పూర్తి
చెయ్యాలని
జులై
నెలలో
సీబీసీఐడీ
అధికారులకు
మద్రాసు
హైకోర్టు
ఆదేశాలు
జారీ
చేసింది.