హెల్ఫ్: చంద్రబాబుకు లేఖ రాసిన పన్నీర్ సెల్వం, ఎందుకంటే ?
వెంటనే 12 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చెయ్యాలని, చెన్నై నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి శనివారం లేఖ రాశారు.
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ప్రజలు తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారని వెంటనే కృష్ణా జలాలను విడుదల చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శనివారం లేఖ రాశారు.
రాజకీయాల్లో్కి వస్తా: నన్ను ఏశక్తులు ఆపలేవు: జయ మేనకోడలు దీపా
వెంటనే కృష్ణా జలాలను విడుదల చెయ్యాలని, చెన్నై నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మనవి చేశారు.
చెన్నై నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తిందని, ఉత్తర చెన్నైలో కలుషిత నీరు సరఫరా అవుతుందని ఫిర్యాదులు వస్తున్నాయని, నగరానికి తాగునీటిని అందించే జలాశయాల్లో నీటి మట్టం చాల వరకు తగ్గిపోందని ప్రతిపక్ష నాయుడు స్టాలిన్ ఆరోపించారు.
వెంటనే దీనిపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 12 టీఎంసీల కృష్ణా జలాలు పొందేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని స్టాలిన్ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మనవి చేశారు.
నెచ్చెలి శశికళ బహిష్కరణ ! అన్నాడీఎంకే లీడర్స్
చెన్నై జలమండలి ఆధ్వర్యంలోని నెమ్మలి నిర్లపణీకరణ పథకం కింద ప్రతి రోజు 100 మిలియన్ లీటర్ల తాగు నీరు లభించేందుకు చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం స్పందించారు.
వెంటనే మాకు రావలసిన 12 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖ విషయంపై ఆంధ్రపద్రశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో అని చెన్నై నగర ప్రజలు వేచి చూస్తున్నారు.