వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ సినీ రంగం దెబ్బ: దిగివచ్చిన సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వంకు చాన్స్, శివాజీ గణేశన్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: బహుబాష నటుడు, తమిళ సినీ రంగం అలనాటి మహానటుడు శివాజీ గణేశన్ మెమోరియల్ భవనం ప్రారంభోత్సవం వివాదానికి చివరికి తెరపడింది. తమిళనాడు ఉప ముఖ్య మంత్రి దివంగత నటుడు శివాజీ గణేశన్ మెమోరియల్ భవనంతో పాటు ఆయన విగ్రహావిష్కరణకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

జయలలిత స్పృహలోని స్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్లారు: షుగర్ లెవెల్స్ 508, కుట్ర జరిగిందా!జయలలిత స్పృహలోని స్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్లారు: షుగర్ లెవెల్స్ 508, కుట్ర జరిగిందా!

అలనాటి మహానటుడు శివాజీ గణేశన్ మెమోరియల్ భవనం, విగ్రహావిష్కరణకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూరమై కేవలం మంత్రులు మాత్రమే హాజరుకావడానికి సిద్దం కావడంతో వివిధ రాజకీయ పార్టీలు మండిపడ్డాయి.

మా నాన్నను అవమానిస్తున్నారని శివాజీ గణేశన్ కుమారుడు, ప్రముఖ నటుడు ప్రభు ఇటీవలే తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. సీఎం, డీసీఎం శివాజీ గణేశన్ మెమోరియల్ భవనం, ఆవిష్కరణకు హాజరుకాలేకపోతున్నామని ప్రకటించడంతో ఆయన అభిమానులు, తమిళ సినీరంగ ప్రముఖులు బహిరంగంగానే విమర్శించారు.

Tamil Nadu CM cleared the air, Panneerselvam to inaugurate Sivaji Ganesan memorial

జయలలిత మృతిపై విచారణ కమిషన్: అంతే గడువు, పత్రేక అధికారాలు, ఏం జరిగింది?జయలలిత మృతిపై విచారణ కమిషన్: అంతే గడువు, పత్రేక అధికారాలు, ఏం జరిగింది?

ఈ నేపథ్యంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అనివార్య కారణాల వలన ఈ కార్యాక్రమానికి తాను హాజరుకాలేకపోతున్నానని, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కచ్చితంగా హాజరు అవుతారని మీడియాకు చెప్పారు.

అక్టోబర్ 1వ తేదీన పన్నీర్ సెల్వం శివాజీ గణేశన్ మెమోరియల్ భవనం, ఆయన స్మారక విగ్రహాం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జయకుమార్ అధ్యక్షత వహించనున్నారు. తమిళనాడుకు చెందిన పలువురు మంత్రులు హాజరుకానున్నారు.

English summary
The controversy surrounding the inauguration of Sivaji Ganesan memorial has finally come to an end, Palaniswami on Friday said his deputy would declare open the building at Adyar in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X