ఢిల్లీలో ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడితో తమిళనాడు సీఎం భేటీ, ఏంటి విషయం !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మంగళవారం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. ఉదయం పార్లమెంట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తమిళనాడు రాష్ట్రంలోని అభివృద్ది పనులు, సమస్యల గురించి ప
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మంగళవారం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. ఉదయం పార్లమెంట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తమిళనాడు రాష్ట్రంలోని అభివృద్ది పనులు, సమస్యల గురించి ప్రధాని మోడీతో చర్చించారు.
తరువాత ఎడప్పాడి పళనిసామి తమిళనాడు మంత్రులు, ఎంపీలు (అమ్మ వర్గం)తో కలిసి నేరుగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం. వెంకయ్యనాయుడి ఇంటికి వెళ్లారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వెంకయ్యనాయుడిని ఎడప్పాడి పళనిసామి సన్మానించారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మా మద్దతు మీకే ఉంటుందని వెంకయ్యనాయుడికి ఈ సందర్బంలోనే ఎడప్పాడి పళనిసామి చెప్పారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతుల దగ్గరకు వెళ్లిన ఎడప్పాడి పళనిసామి వారితో చర్చించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ చీలిక వర్గం నాయకుడు పన్నీర్ సెల్వం సైతం సోమవారం ఢిల్లీలో వెంకయ్యనాయుడికి మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications