వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత తలవంచేది ఎవ్వరి ముందో తెలుసా !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో ఎవ్వరి ముందు తలవంచలేదని అందరూ అంటుంటారు. అయితే జయలలిత ఊహ తెలిసిన తరువాత ఆ దేవుడి తరువాత ముగ్గురి ముందు తలవంచారు.

జన్మనిచ్చిన తల్లి సంధ్య, రాజకీయ జన్మనిచ్చిన ఎంజీఆర్ తరువాత అంతటి గౌరవం గుర్తింపు తెచ్చుకున్న వారు మరో వ్యక్తి ఉన్నారు. ఆయనే చో రామస్వామి. ఎంజీఆర్ చనిపోయిన తరువాత జయలలిత తమిళనాడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.

Tamil Nadu former Chief Minister Jayalalithaa and Cho Ramaswamy

ఐదు సార్లు ముఖ్యమంత్రి అయిన జయలలిత తమిళనాడు రాజకీయాల్లో కేంద్ర బిందువు అయ్యారు. ఆమె ఎవ్వరి ముందు తలవంచలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా పోరాటం చేశారు. అయితే ఫిబ్రవరి 24వ తేది వచ్చిందంటే ఆమె తుగ్లక్ పత్రిక సంపాదకుడు, రచయిత, సినీ నటుడు, న్యాయవాది, సినిమా దర్శకుడు అయిన చో రామస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.

ప్రతి పుట్టిన రోజు చో రామస్వామి, సౌందర రామస్వామి దంపతుల ముందు జయలలిత శిరసు వంచి ఆశీర్వాదం తీసుకుంటారు. మరెవరి ముందు జయలలిత తలవంచినట్లు ఎప్పుడు ఎవ్వరూ చూడలేదు. జయలలిత, చో రామస్వామి మధ్య అంతటి అనుభందం ఉంది.

Tamil Nadu former Chief Minister Jayalalithaa and Cho Ramaswamy

జయలలిత డిసెంబర్ 6వ తేది సోమవారం, డిసెంబర్ 7వ తేది మంగళవారం ఉదయం చో రామస్వామి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోనే ఒక్క రోజు తేడాతో మరణించారు. జయలలిత మరణించారని చో రామస్వామికి అదే ఆసుపత్రిలో ఉన్నా ఎవ్వరూ చెప్పలేదు.

English summary
J Jayalalithaa was an Indian actress and politician who served five terms as the Chief Minister of Tamil Nadu between 1991 and 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X