13మంది మృతి: స్టెరిలైట్ ప్లాంట్ శాశ్వత మూసివేత
చెన్నై: తూత్తుకుడి ఆందోళనల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. స్టెరిలైట్ ప్లాంటును శాశ్వతంగా మూసివేసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు.
కేబినెట్ సమావేశం తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్ కారణంగా స్థానికులు అనారోగ్యానికి గువుతున్నారని, వెంటనే మూసివేయాలంటూ గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. మే 22న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13మంది ఆందోళనకారులు మృతి చెందారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.
State government has been taking steps to close down Sterlite plant, through legal means. #SterliteProtest
— Edappadi K Palaniswami (@CMOTamilNadu) May 24, 2018
రాజకీయ పార్టీలు ఆందోళనకారులకు మద్దతుగా నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్టెరిలైట్ ప్లాంటును శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించింది.