వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికలతో తేలనున్న తమిళనాడు,కర్ణాటక ప్రభుత్వాల మనుగడ

|
Google Oneindia TeluguNews

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు దక్షినాది రాష్ట్ర్రాలైన ఒడిశా,,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర్రలతోపాటు ఈశాన్య రాష్ట్ర్రాలైన ,ఆరుణచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్ర్రాల భవితవ్వం తేలనుంది. అయితే ఈ దేశవ్యాప్తంగా వెలువడే ఫలితాలతోపాటు దక్షిణాదీలో జరిగిన ఉప ఎన్నికలు జరిగిన తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర్రాల్లో కూడ జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్ర్రాల భవితవ్వాన్ని తేల్చనున్నాయి. ఈనేపథ్యంలో తమిళనాడులో,కర్ణాటక రాష్ట్ర్రాల్లో ఉపఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి.

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే కష్టకాలం

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే కష్టకాలం

పార్లమెంట్ సీట్లలో ప్రతిపక్ష పార్టీల హవాకొనసాగిన నేపథ్యంలో అక్కడ మొత్తం 22 రాష్ట్ర్ర అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి..ఈ ఉపఎన్నికలతో ముఖ్యమంత్రి పళని స్వామి ప్రభుత్వ భవిష్యత్ కూడ తేలనుంది. ఈనేపథ్యంలోనే మొత్తం తమిళనాడులో 234 స్థానాలు ఉండగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు 114 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కాగా ప్రతిపక్ష డీఎంకే పార్టీకి 98 స్థానాలు ఉన్నాయి. కాగా అధికార అన్నాడీఎంకేకు మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు మరో స్థానాలు అవసరమవుతాయి.

తమిళనాడులో ఎన్నికల్లో పుంజుకోనున్న డీఎంకే

తమిళనాడులో ఎన్నికల్లో పుంజుకోనున్న డీఎంకే

కాని అధికార పార్టీలో కూడ మరో ముగ్గురు ఫిరాయింపుదారులు ఉన్నారు. దీంతో ప్రభుత్వానికి మొత్తం సుమారు ఏడు నుండి ఎనిమిది స్థానాలు ఖచ్చితంగా అవసరమపడుతాయి. ప్రతిపక్ష డీఎంకేకు ప్రస్తుతం 98 స్థానాలు ఉన్న నేపథ్యంలో మరో నలుగురు ఫిరాయింపు సభ్యులు డీఎంకేకు మధ్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఒకవేళ గనుక డీఎంకే కనీసం పదిస్థానాలు గెలుచుకుంటే గనుక తమిళనాడు ప్రభుత్వానికి ముప్పు వాటిళ్లే ప్రమాదం ఉంది.

ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు ప్రతిపక్ష డీఎంకే వైపే

ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు ప్రతిపక్ష డీఎంకే వైపే

ఇలాంటీ పరిస్థితుల్లో బట్టి తమిళనాడులో అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకే వైఫల్యం చెందినట్టుగా ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడ్డాయి..తమిళనాడులో గత కొద్ది రోజుల క్రితం నుండి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అధికార ఏఐఏడిఎంకేతో బీజేపీ మంచి సంబంధాలనే కొనసాగిస్తూ వచ్చింది. దీంతో అటు బీజేపీ ఇటు ఏఐఏడిఎంకే పార్టీలు పోత్తులు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్లాయి. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కొనసాగినా..తమిళనాడు మాత్రం అంతంత మాత్రంగానే ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీంతో రెండు పార్టీల అలయెన్స్ కేవలం 3 నుండి 4 స్థానాలు కైవసం చేసుకోనుండగా కాంగ్రెస్ పార్టీ ,డీఎంకే అలయెన్స్ కు 34 నుండి 38 సీట్లను కైవసం చేసుకోనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. సో ఇలాంటీ పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.

కర్ణాటకలో కీలకం కానున్న ఉప ఎన్నికల ఫలితాలు..

కర్ణాటకలో కీలకం కానున్న ఉప ఎన్నికల ఫలితాలు..

మరోవైపు 224 సీట్లున్నకర్ణాటక అసెంబ్లీలో కూడ అధికార పార్టీకి ఎన్నికలు ఫలితాలు అనుకూలంగా రాకపోతే ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం కనిపిస్తుంది. ఈనేపథ్యంలోనే కర్ణాటకలో బీజేపీకి 104 స్థానాలున్నాయి . కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 113స్థానాలు. ఇక ఎగ్జిట్ ఫలితాలు వెలువడినట్టే కేంద్రంలో గనక మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే... సంకీర్ణ ప్రభుత్వంలోని కొంతమంది ఎమ్మెల్యేలు భాజపాలోకి వచ్చే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.. మరోవైపు కర్ణాటకలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు కూడ జరిగాయి. దీంతో ఉప ఎన్నికల్లోని రెండు స్థానాల్లో బీజేపీ గనుక గెలిస్తే బీజేపీ పావులు కదిపే అవకాశం ఉంటుంది.వీటితో పాటు అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్, ఇటు బీజేపీ కేంద్రమంత్రి సదానంద గౌడ చేసిన రాష్ట్ర్రంలో కలకలం రేపుతున్నాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ అలయెన్స్‌కు వ్యతిరేక పవనాలు

కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ అలయెన్స్‌కు వ్యతిరేక పవనాలు

కర్ణాటక రాష్ట్ర్రంలో అధికార జేడిఏస్ కూడ చిత్తుగా ఓడిపోనుట్టు ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడ్డాయి.. జేడిఎస్ అధికారంలో ఉన్న ఆ పార్టీని ప్రజలు ఆధరించలేదు. దీంతో అధికార జేడిఎస్‌తో జతకట్టిన కాంగ్రెస్ పార్టీని సైతం ప్రజలు వ్యతిరేకించారు. గత సంవత్సరమే అధికారంలో వచ్చిన జేడిఎస్‌ను కాదని బీజేపీకి పట్టం కట్టారు. ఈనేపథ్యంలోనే 2014లో బీజేపీకి 17 సీట్లను కైవసం చేసుకోగ 2019 ఎన్నికల్లో కూడ 21 నుండి 25 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఇక కాంగ్రెస్ ,జేడిఎస్ పార్టీలకు 3 నుండి 6 స్థానాలు కైవసం చేసుకోనుంది.

English summary
The Narendra Modi-led NDA government is set to come back to power with a landslide majority,The NDA was predicted to win between 339 and 365 seats while the UPA was projected to win 77-108 seat but in south state governaments has failed to get votes. but tamilanadu,and karnataka state governaments also depends byelections results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X