టాటా మరో కీలక నిర్ణయం! : మిస్త్రీ 'వాటా' విక్రయాలకు ప్రయత్నాలు
న్యూఢిల్లీ : సైరన్ మిస్త్రీని తొలగించినప్పటి నుంచి టాటా గ్రూప్ వ్యవహారం వార్తల్లో నానుతూనే ఉంది. మిస్త్రీ తొలగింపుతో టాటా గ్రూప్ కు సుమారు రూ.17 వేల కోట్లు నష్టం వాటిల్లినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదంతో ముడిపడి ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన చక్కబెట్టేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగానే.. టాటా గ్రూప్లో మెజారిటీ స్టాక్ హోల్డర్స్ మిస్త్రీ కుటుంబం షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ వాటా కొనుగోలు దారుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది టాటా. టాటా సన్స్ లోని షాపూర్జీ పల్లోంజి 18శాతం విక్రయించడానికి ఆసక్తి కనబరిచే కొనుగోలుదారుల కోసం టాటా అన్వేషిస్తున్నట్లుగా బ్లూమ్ బర్గ్ రిపోర్టు వెల్లడించింది.
వాటా విక్రయాలకు సమర్థవంతమైన కొనుగోలుదారుల కోసం టాటా ఇప్పటికే సావరిన్ హెల్త్ ఫండ్ మరియు ఇతర దీర్ఘకాలిక పెట్టుబడిదారులతో సంపద్రింపులు జరిపినట్టు నివేదించింది. టాటా సన్స్ లిస్టెడ్ కంపెనీలో 65 బిలియమన్ డాలర్ల వాటాను కలిగి ఉంది.
ఇదిలా ఉంటే, ఈక్విటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ పరాస్ బోత్రా.. ఈ వార్తల్లో నిజం తేల్చేయడం గమనార్హం. ఇదంతా సులువుగా తేలే వ్యవహారం కాదని, మిస్త్రీ తన పోరాటాన్ని వదిలే ప్రస్తక్తే లేదని తెలిపారు. కగా, ఈ వార్తలపై ఇటు టాటా సన్స్, అటే షాపూర్జీ పల్లాంజీ గ్రూపులు రెండూ ఇంతవరకు స్పందించలేదు.