శుభవార్తే:సీనియర్ సిటిజన్లు రూ.5 లక్షలు డిపాజిట్టు చేసినా నష్టం లేదు
70 ఏళ్ళు దాటినా వారు ఐదు లక్షల వరకు డిపాజిట్ చేసిన రద్దుచేసిన నగదును ఎలాంటి పరిశీలన చేయబోమని ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీ:70 ఏళ్ళు దాటినా వారు ఐదు లక్షల వరకు డిపాజిట్ చేసిన రద్దుచేసిన నగదును ఎలాంటి పరిశీలన చేయబోమని ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది.అయితే ఆదాయపు పన్నుశాఖ వెబ్ సైట్ లో వివరాలను నమోదు చేస్తే వెరిఫికేషన్ పూర్తైనట్టేనని ఆదాయపు పన్నుశాఖ అధికారులు చెబుతున్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఆదాయపు పన్నుశాఖ అనుమానాస్పద ఖాతాలను పరిశీలిస్తోంది.ఈ మేరకు నవంబర్ 8వ,తేది తర్వాత లావాదేవీలపై నిఘా పెట్టింది.
నవంబర్ 8వ, తేదికి ముందు ఆ తర్వాత ఆయా ఖాతాల వివరాలను ఆదాయపు పన్నుశాఖ పరిశీలిస్తోంది. అనుమానాస్పద ఖాతాల వివరాలను ఇప్పటికే సేకరించింది. అయితే ఇతరుల ఖాతాల్లో నల్లధనాన్ని డిపాజిట్ చేసిన ఘటనలు కూడ ఉన్నాయి.
ఆదాయపు పన్నుశాఖ ఇప్పటికే ఆయా ఖాతాల సమాచారం ఆదారంగా ఖాతాదారులకు నోటీసులు పంపారు.ఈ నోటీసుల ఆధారంగా ఆదాయపు పన్నుశాఖకు సమాధానం చెప్పాల్సిందే.
సీనియర్ సిటిజన్ల ఖాతాలకు మినహయింపు
సీనియర్ సిటిజన్ ఖాతాదారులకు ఆదాయపు పన్నుశాఖ శుభవార్త చెప్పింది. నవంబర్ 8వ, తేది తర్వాత 70 ఏళ్ళు దాటినా సీనియర్ సిటిజన్లు ఐదులక్షల వరకు రద్దు చేసిన నగదు నోట్లను డిపాజిట్టు చేస్తే ఆ ఖాతాలను పరిశీలించబోమని ఆధాయపు పన్నుశాఖ ప్రకటించింది.అయితే రూ.2.5 లక్షలకు మించిన ఇతర వ్యక్తిగత డిపాజిట్లపై విచారణ ఉంటుందని ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది.ఈ మేరకు ఆదాయపు పన్నుశాఖ బుదవారం నాడు ప్రకటన చేసింది.
డిపాజిట్ల ధృవీకరణకు స్పష్టమైన మార్గాలు
గత ఏడాది నవంబర్ నుండి డిసెంబర్ మాసాల్లో డిపాజిట్ల ధృవీకరణకు స్పష్టమైన మార్గాలు చేపట్టినట్టుగా ఆదాయపు పన్నుశాఖాధికారులు చెబుతున్నారు. పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత డిపాజిట్ల విషయమై ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టబోమని ఆదాయపు పన్నుశాఖాధికారులు ప్రకటించారు.
ఆదాయపు పన్నుశాఖ వెబ్ సైట్ లో నమోదు చేస్తే చాలు
సీనియర్ సిటిజన్లు గత ఏడాది నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఐదు లక్షల వరకు రద్దు చేసిన నగదును డిపాజిట్లు చేస్తే దానికి సంబందించిన సమాచారాన్ని ఆదాయపు పన్నుశాఖ వెబ్ సైట్ లో నమోదు చేస్తే సరిపోతోందని ఆధాయపు పన్నుశాఖాధికారులు ప్రకటించారు.అయితే ఆదాయ ఆదార వివరాలను నమోదు చేస్తే సరిపోతోందని ఐటిశాఖాధికారులు ప్రకటించారు.ఈ వివరాలు సమర్పిస్తే వెరిఫికేషన్ పూర్తి కానుందని అధికారులు ప్రకటించారు.ఇంతకు మించి ఎలాంటి విచారణ థర్ఢ్ పార్టీ వెరిఫికేషన్ ఉండదని అధికారులు చెబుతున్నారు.
ఆదాయపు పన్నుశాఖ వెబ్ సైట్ లో నమోదు చేస్తే చాలు
సీనియర్ సిటిజన్లు గత ఏడాది నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఐదు లక్షల వరకు రద్దు చేసిన నగదును డిపాజిట్లు చేస్తే దానికి సంబందించిన సమాచారాన్ని ఆదాయపు పన్నుశాఖ వెబ్ సైట్ లో నమోదు చేస్తే సరిపోతోందని ఆధాయపు పన్నుశాఖాధికారులు ప్రకటించారు.అయితే ఆదాయ ఆదార వివరాలను నమోదు చేస్తే సరిపోతోందని ఐటిశాఖాధికారులు ప్రకటించారు.ఈ వివరాలు సమర్పిస్తే వెరిఫికేషన్ పూర్తి కానుందని అధికారులు ప్రకటించారు.ఇంతకు మించి ఎలాంటి విచారణ థర్ఢ్ పార్టీ వెరిఫికేషన్ ఉండదని అధికారులు చెబుతున్నారు.
ఆపరేషన్ క్లీన్ మనీ పథకం
నల్లధనం ఏరివేతకు గాను ఆపరేషన్ క్లీన్ మనీ పథకాన్ని ప్రారంభించినట్టుగా ఆదాయపు పన్నుశాఖాధికారులు చెబుతున్నారు. పెద్ద నగదు నోట్ల రద్ద తర్వాత రూ.5 లక్షలకు మించి నగదు జమ అయిన రూ.18 లక్షల మంది వివరాల కోరుతూ ఎస్ ఎం ఎస్ లు ఈ మెయిల్స్ ను ఆదాయపుపన్ను శాఖ పంపింది.వారిలో 6 లక్షల మంది ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా బదులిచ్చారు.పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత భారీ మొత్తాల్లో నగదు జమ చేసిన ఖాతాల పరిశీలన సందర్భంగా పన్ను చెల్లింపుదారుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశించింది.