షాక్: రూ.3500 కోట్ల బినామీ ఆస్తుల జప్తు, కఠిన శిక్షలు
న్యూఢిల్లీ: బినామీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా రూ.3500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బినామీ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది.
దేశంలో నల్లధనాన్ని పూర్థిస్థాయిలో నిర్మూలించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత బినామీ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ సీరియస్ గా దృష్టి కేంద్రీకరించింది.
శుభవార్త: 80 సీ సెక్షన్ కింద పెట్టుబడుల పరిమితుల పెంపుకు జైట్లీ యోచన?
అయితే బినామీ చట్టం ప్రకారంగా సరైన ఆధారాలు చూపని వారి ఆస్తులను ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. అయితే పలు రకాల్లో ఈ ఆస్తులను జప్పు చేసినట్టు అధికారులు ప్రకటించారు.
రూ.3500 కోట్ల ఆస్తుల జప్తు
2016 నవంబర్ 1వ, తేది నుండి అమల్లోకి వచ్చిన బినామీ చట్టం కింద సుమారు రూ.3500 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది.ఫ్లాట్లు, దుకాణాలు, ఆభరణాలు, వాహనాలతో కూడిన 900 బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది
తాత్కాలిక జప్తు
ఈ చట్టం కింద బినామీ ఆస్తులను (స్థిర, చరాస్తులు) ముందు తాత్కాలికంగా... ఆ తర్వాత పూర్తిగా జప్తు చేసే అధికారాలుంటాయి. అలాగే అనుచిత లబ్ధి పొందిన యజమాని, బినామీగా వ్యవహరించిన వారు, లావాదేవీలకు కారకులైన వారిపై న్యాయ విచారణ జరపనున్నారు.
దోషులకు ఏడేళ్ళ శిక్ష
బినామీ ఆస్తి లావాదేవీల నిరోధక చట్టం కింద మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ విభాగం ప్రకటించింది.పాటు ప్రాపర్టీ మార్కెట్ విలువలో 25 శాతం దాకా జరిమానా కూడా విధించనున్నట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది.
రూ.110కోట్ల విలువైన స్థలం బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్
రూ.110
కోట్ల
విలువైన
50
ఎకరాల
స్థలాన్ని
బినామీ
పేర్లతో
ఒక
రియల్
ఎస్టేట్
సంస్థ
రిజిస్టర్
చేసిందని
ఆదాయపన్ను
శాఖ
ప్రకటించింది.మరో
కేసులో
పెద్ద
నోట్ల
రద్దు
అనంతరం
ఇద్దరు
అసెస్సీలు
తమ
ఉద్యోగులు,
సంబంధీకులకు
చెందిన
ఖాతాల్లో
దాదాపు
రూ.
39
కోట్లు
జమచేసినట్లు
బయటపడిందని
ప్రకటించింది.