2574మంది: ఉద్యోగుల తొలగింపు పుకార్లపై టీసీఎస్ సాఫ్టువేర్ కంపెనీ
హైదరాబాద్: తమ సంస్థలో ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారంటూ ఇటవీల సామాజిక అనుసందాన వెబ్ సైట్లలో వచ్చిన పుకార్లను ప్రముఖ సాఫ్టువేర్ కంపెనీ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఖండించింది. ఇప్పటి వరకు 2,574 మందిని మాత్రమే ఉద్యోగం వీడాలని ఆదేశించామని తెలిపింది.
ఈ సంఖ్య మూడువేలకు మించి ఉండబోదని టీసీఎస్ తెలిపింది. ఉద్యోగుల సంక్షేమంలో తమ సంస్థ అందరికంటే ముందు ఉంటుందని తెలిపింది.
కాగా, గత కొద్ది వారాలుగా సోషల్ మీడియాలో.. టీసీఎస్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసేస్తారనే పుకార్లు వచ్చాయి. పర్ఫార్మెన్స్ ప్రాతిపదికన దాదాపు ఇరవై అయిదు వేల మంది ఉద్యోగులను తీసేయవచ్చుననే పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో పలు కార్మిక సంఘాలు టీసీఎస్ ఉద్యోగులకు మద్దతుగా వచ్చాయి.
ఈ నేపథ్యంలో టీసీఎస్ స్పందించింది. తాము కేవలం 2,574 మందిని మాత్రమే ఉద్యోగం వీడాలని చెప్పామని, అది తమ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో కేవలం 0.8 శాతం మాత్రమేనని పేర్కొంది.