ఉద్యోగులకు టీసీఎస్ వన్-టైమ్ బోనస్ బొనాంజా: రూ. 2,628 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద సాప్ట్ వేర్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ ఉద్యోగులకు రూ. 2,628 కోట్లు బోనస్గా ఇచ్చేందుకు అంగీకరించింది. ఆగస్టు 2004లో కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కు రావడంతో పాటు కంపెనీ స్ధాపించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యోగులకు ప్రత్యేక రివార్డు లేదా వన్ టైమ్ బోనస్ ఇవ్వనున్నట్లు టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ అన్ని బ్రాంచీల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్న వారు ఈ బోనస్కు అర్హులు. అంతేగాక ప్రతి ఉద్యోగికి వారి ప్రతి సంవత్సరంలోని వారం జీవితాన్ని కానుకగా అందిరికీ సమానంగా ఇవ్వనున్నట్లు టీసీఎస్ ప్రకటనలో వెల్లడించింది.
అక్టోబర్ - డిసెంబర్ 2014 నాటికి ఈ కంపెనీలో 3.18 లక్షల మంది ఉద్యోగులుగా ఉన్నట్లు టీసీఎస్ సీఈఓ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఆగస్టు 2004న భారతీయ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్డ్ అయిన టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో అత్యంత విలువైన కంపెనీగా ఉంది.