టీడీపీ ఎంపీల కోసం ఢిల్లీ పోలీస్ స్టేషన్కు కేజ్రీవాల్, మోడీపై తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఆందోళన చేసిన తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు.
ప్రధాని మోడీ నివాసం ఎదుట టీడీపీ ఎంపీల ధర్నా, హల్చల్, అరెస్ట్
హోదా సాధనలో భాగంగా ఆదివారం ఉదయం ప్రధాని నివాసం వద్ద ఆందోళన చేస్తున్న టిడిపి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకొని తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్కు తరలించారు.
కేజ్రీవాల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎంపీలను పరామర్శించారు. వారికి సంఘీభావం ప్రకటించారు. టీడీపీ న్యాయపరమైన డిమాండ్లకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఎంపీల ఆందోళనకు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఏపీకీ హోదా ఇచ్చి తీరాలని, ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చడంలో ప్రధాని పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఎంపీల అరెస్టును ఖండించారు.
TDP MPs taken to Tughlak Road Police Stn for demanding Spl status for AP. I went and met them at police stn in solidarity. We condemn their detention and fully support demand for spl status of AP. pic.twitter.com/QGJsuTyg2q
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 8, 2018