గురు శిష్యుల లవ్ స్టోరీ: ఆత్మహత్య
నాసిక్: గురు శిష్యులు ప్రేమించుకుని చివరికి పెద్దలు పెళ్లికి అంగీకరించరనే భయంతో విషం సేవించిన సంఘటన నాసిక్ సమీపంలో జరిగింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక మరణించడంతో ప్రియుడు చికిత్స పోందుతున్నాడు.
జల్ గావ్ జిల్లాలోని గులానే గ్రామంలో నివాసం ఉంటున్న బాలిక (17) ప్రయివేటు స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నది. అదే గ్రామంలో నివాసం ఉంటున్న సుమధాన్ సుభాష్ పాటిల్ (27) ఆ స్కూల్ లోనే టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ ఆకర్షణకు లోనైనారు.
ఇద్దరూ ప్రేమించుకున్నారు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా జాగ్రత్తపడ్డారు. మూడు రోజుల క్రితం ఇద్దరూ గ్రామం విడిచిపరారైనారు. ఇరుకుటుంబ సభ్యులు పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
నాసిక్ జిల్లాలోని చందన్ వాడ్ ప్రాంతంలోని చండ్రేశ్వరి ఆలయం సమీపంలో సోమవారం ఇద్దరూ విషం సేవించి కుప్పకూలిపడి ఉన్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే విద్యార్థిని మరణించిందని వైద్యులు నిర్దారించారు. టీచర్ సుభాష్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడని, వీరి ప్రేమను పెద్దలు అంగీకరించరనే అనుమానంతోనే విషం సేవించారని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.