వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగష్టు 15 వేడుకల నుండి వస్తోన్న విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్

ఇంటర విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ చోటుచేసుకొంది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.ఆగష్టు 15 వేడుకలకు కాలేజీకి వెళ్ళి వస్తున్న విద్యార్థినిపై అత్యాచారం చేశారు నిందితులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒడిశా: స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకొంది.

ఒడిశా రాష్ట్రంలోని బంజనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెల్లుగుంటా ఔట్ పోస్ట్ పరిధిలో మందరా గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని బల్లిగుంఠా కాలేజీలో ఇంటర్ చదువుతోంది. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు కాలేజీకి వెళ్ళి సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు యువకులు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Teen alleges gang rape on I-Day in Odisha, cops arrest four

ధనుంజయపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు విద్యార్థిని బొడో నదికి సమీపంలోని చెట్లపొదల్లోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహతప్పి పడిపోయిన విద్యార్థినిని రొడ్డుపక్కన వదిలేసి వెళ్ళారు.

సాయంత్రం వరకు కూతురు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. నది ఒడ్డున కూతురు పడి ఉన్న విషయాన్ని గ్రామస్థుల ద్వారా తెలుసుకొన్న కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్ళారు.

బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. కుటుంబసభ్యులు బెల్లిగుంఠా ఔట్‌పోస్ట్ అధికారికి ఫిర్యాదుచేశారు. ధనుంజయ్‌పల్లికి చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
Four people were arrested on Thursday for allegedly raping a teen girl on August 15 while she was on her way back from an Independence Day programme in Odisha’s Ganjam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X