స్నేహితుడే ఇంటి వద్ద ఆమెను ఏం చేశాడంటే, రక్తం మడుగులో ఆమె
న్యూడిల్లీలో ఓ యువతిపై స్నేహితుడు కాల్పులు జరిపి హత్య చేశాడు. యోగేష్ ,శుభమ్ అనే ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ యువతి మధ్యాహ్న భోజనానికి వెళ్ళింది. భోజనం ముగించుకొని షాపింగ్ చేసి సాయంత్రానికి ఆమె తిరిగి వచ
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓ యువతిపై స్నేహితుడు కాల్పులు జరిపి హత్య చేశాడు. ఇంటి ఎదుటే ఈ ఘోరం జరిగింది. ఇంటి ఎదుటే స్నేహితుడు ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఆమెతో అప్పటివరకు కలిసి తిరిగి వచ్చి ఇంటి ఎదుటే తుపాకీతో కాల్చిచంపాడు. బుల్లెట్ శబ్దంవిని బయటకు పరుగెత్తుకు వచ్చిన తల్లికి రక్తపు మడుగులో ఉన్న కూతురు కనిపించింది.
ఢిల్లీలోని నజఫ్ ఘడ్ కు చెందిన ఓ యువతి యోగేష్ ,శుభమ్ అనే ఇద్దరు స్నేహితులతో కలిసి మధ్యాహ్న భోజనానికి వెళ్ళింది. రెస్టారెంట్ లో భోజనం చేసి తిరుగు ప్రయాణంలో షాపింగ్ చేశారు.స్నేహితులతో కలిసి భోజనానికి వెళ్ళిన కూతురు ఇంకా రాలేదని తల్లి ఆందోళన చెందింది.
కూతురు షాపింగ్ లో ఉన్న సమయంలోనే తల్లి ఆమెకు ఫోన్ చేసింది.షాపింగ్ చేస్తున్నామని త్వరలోనే ఇంటికి చేరుకొంటామని ఆమె చెప్పింది .దీంతో కూతురు గురించి పెద్దగా ఆందోళన చెందలేదు తల్లి.
అయితే ఇంటి వద్ద ఆ యువతిని దింపారు ఇద్దరుస్నేహితులు. కారు వద్దే దిగి యోగేష్ తో ఆమె మాట్లాడుతోంది.అయితే కారులో కూర్చొన్న శుభమ్ ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు. ఆమెను కాల్చి చంపేందుకు ఉపయోగించిన తుపాకీని అక్కడ వదిలేసి వెళ్ళాడు.
ఏదో చప్పుడు అయిందని బయటకు వచ్చిన తల్లికి తన కూతురు రక్తపు మడుగులో ఉన్న విషయాన్ని గుర్తించింది. యోగేష్ తో కలిసి ఆమె తన కూతురును ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ప్రకటించారు.