అమ్మాయి కిడ్నాప్, గ్యాంగ్ రేప్ చేసి గుర్తు పడుతుందని కళ్లు పీకేసి సిగరెట్లతో కాల్చి హత్య, కిరాతకులు!
లక్నో/గోరఖ్ పూర్: అమ్మాయిని కిడ్నాప్ చేసిన కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. అత్యాచారం చేసిన శాడిస్టులు ఆమె శరీరంపై సిగరేట్లతో కాల్చి చిత్రహింసలు చేశారు. చివరికి అమ్మాయి తమను గుర్తు పడుతుందనే భయంతో హత్య చేసిన కామాంధులు మృతదేహాన్ని విసిరేసి కేసు నుంచి తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.
కెవ్వుకేక: వినాయక చవితికి కైలాస దేశం కోసం కొత్త బ్యాంకులు, కరెన్సీ, చట్టాలు, నిత్యానందస్వామి !
ఇంటి ముందే అమ్మాయి మాయం
ఉత్తరప్రదేశ్ లో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లోని లంఖిపూర్ ఖేరిలో శనివారం సాయంత్రం ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న 13 ఏళ్ల బాలిక మాయం అయ్యింది. అమ్మాయి బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు మొదట బావించారు.
ఏం జరిగిందో తెలీదు!
రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యలు గాలించారు. బాలిక ఆచూకి చిక్కకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలిక కోసం చుట్టుపక్కల గ్రామాల్లో గాలించినా ఎలాంటి ఫలితం లేకపోయింది.
చెరుకు తోటలో శవం
పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న సమయంలోనే అటవి ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలోని చెరుకు తోటలో బాలిక శవమై కనిపించింది. బాలిక శరీరం మీద దుస్తులు అన్ని చిరిగిపోయి ఉండటం, శరీరం మీద కాల్చిన గుర్తులు ఉండటంతో ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని పోలీసులకు అనుమానం వచ్చింది. బాలికపై సామూహిక అత్యాచారం చేశారని, శరీరం మొత్తం సిగరెట్లతో కాల్చి గొంతు నులిమి, కళ్లు పీకేసి కిరాతకంగా చంపేశారని వైద్యులు నివేదిక ఇచ్చారు.
కిరాతకులు అరెస్టు
ఇంటి ముందు ఉన్న బాలికను అదే ప్రాంతం వాళ్లే పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేసి చంపేసుంటారని పోలీసులకు అనుమానం పెరిగింది. బాలిక నివాసం ఉంటున్న లిఖింపుర్ ఖేరి ప్రాంతంలోనే నివాసం ఉంటున్న అర్జున్, అతని స్నేహితుడు చోటు అనే ఇద్దరు అనుమానస్పదంగా తిరగుతున్న విషయం గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను తామే కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశామని, ఎక్కడ తమ మీద ఫిర్యాదు చేస్తుందో అనే భయంతో సిగరెట్లతో కాల్చి కళ్లు పీకేసి నిప్పంటించి హత్య చేశామని నిందితులు అంగీకరించారు. బాలిక కళ్లు పీకి దారుణంగా చిత్రహింసలు పెట్టడం వలనే ఆమె ప్రాణాలు పోయాయని పోలీసుల విచారణ వెలుగు చూసింది, అర్జున్, చోటును అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.