వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్ఫీ సరదాకి ఇద్దరు స్నేహితులు బలి

|
Google Oneindia TeluguNews

నాసిక్‌: నేటి యువత సెల్ఫీలు దిగేందుకు చూపుతున్న ఉత్సాహం.. ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చూపడం లేదు. దీంతో వారు తమ ప్రాణాలే పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాసిక్‌లో వాల్దేవి డ్యామ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం విహార యాత్రకని ఓ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వాల్దేవి డ్యామ్‌కు వెళ్లారు.

Teenager Drowns While Clicking Selfie, Friend Dies Trying To Save Him

సౌరభ్‌ జగన్నాథ్‌ చౌల్బార్‌(18) అనే విద్యార్థి డ్యామ్‌ వద్ద రాయిపై నిలబడి సెల్ఫీ తీసుకోబోయాడు. ఆ సమయంలో రాయిపై పాదం పట్టు తప్పడంతో నీటిలో పడి కొట్టుకుపోయాడు.

వెంటనే స్నేహితుడిని కాపాడదామని దిగిన మరో విద్యార్థి అజ్యింకా భావ్‌సాహెబ్‌ గైకర్‌(18) కూడా నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని జాలర్ల సహాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

English summary
A college student died after drowning in Waldevi dam while taking a 'selfie' and his friend who jumped into the water to save him died too, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X