ఘనంగా పెళ్లి! కన్నీటితో పుట్టింటికి ఐశ్వర్య: తేజ్ ప్రతాప్ డ్రగ్స్ బానిస, వింత ప్రవర్తన, విడాకులు!
పాట్నా: వారిద్దరి వివాహం కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. కొంత కాలానికే వారిద్దరి మధ్య బేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. దీంతో కలిసి ఉండటం ఇష్టం లేక విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. విడాకుల కేసు కోర్టులో ఉండగానే ఆమె అత్తారింటిని వీడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదంతా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య గురించి.
కన్నీటితో పుట్టింటికి..
వివరాల్లోకి వెళితే.. విడాకుల కేసుకు సంబంధించి కోర్టుకు బదులిచ్చిన నెల రోజులు ముగిసిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు, తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యా రాయ్ కన్నీటితో అత్తారింటిని పుట్టింటికి వెళ్లిపోయారు. తండ్రి చంద్రికారాయ్ వాహనంలో ఆమె అత్త రబ్రీదేవి ఇంటి నుంచి పయనమయ్యారు.
ఘనంగా వివాహం..
గత సంవత్సరం మేలో ఎంతో ఆర్భాటంగా ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. అయితే, కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య కలతలు చోటు చేసుకున్నాయి. తన భర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్కు బానిసయ్యాడని ఐశ్వర్య గత కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. గృహ హింస నుంచి తనను కాపాడాలని ఆమె ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు కూడా.
Recommended Video
డ్రగ్స్కు బానిసయ్యాడు.. అంతేగాక..
తేజ్
ప్రతాప్
డ్రగ్స్కు
బానిస
అయ్యాడనే
విషయం
తనకు
పెళ్లి
అయిన
కొద్ది
రోజులకే
తెలిసిందని
ఐశ్వర్య
తెలిపారు.
తన
అత్తమామలకు
ఈ
విషయం
తెలిపినా
వారు
పట్టించుకోవడం
లేదని
తన
ఫిర్యాదులో
ఆమె
పేర్కొన్నారు.
అంతేగాక,
డ్రగ్స్
తీసుకున్న
తర్వాత
తేజ్
ప్రతాప్..
శ్రీకృష్ణుడిగా,
రాధగా
దుస్తులు
ధరించేవాడని
ఐశ్వర్య
తెలిపింది.
విసిగిపోయా..
దేవీదేవతలుగా దుస్తులు ధరిస్తాడని తనకు పెళ్లైన కొద్ది రోజులకు తెలిసిందని చెప్పింది. డ్రగ్స్ మత్తులో అతడు ఓసారి గగ్రా, ఛోలీ ధరించి.. మేకప్ వేసుకుని, విగ్గు పెట్టుకుని రాధగా తయారయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతని వింత ప్రవర్తనతో విసిగిపోయి విడాకాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు వాపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా అత్త రబ్రీ దేవి ఇంటి కన్నీళ్లు పెట్టుకుంటూ ఐశ్వర్య తన తండ్రితో పుట్టింటికి వెళ్లిపోయింది.