‘ఐ మిస్ యూ పాపా’: నిశ్చితార్థం రోజున లాలూ కోసం తేజ్ ప్రతాప్ భావోద్వేగ ట్వీట్
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. బీహార్ మాజీ మంత్రి చంద్రిక రాయ్ కుమార్తె అయిన ఐశ్వర్య రాయ్ను తేజ్ ప్రతాప్ పెళ్లాడబోతున్నారు.
ఐశ్వర్యరాయ్తో తేజ్ప్రతాప్ నిశ్చితార్ధం, 200 మంది అతిథులు
పాట్నాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బుధవారం వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దాదాపు 200 మంది దగ్గరి బంధువులు ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం సందర్భంగా ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, పుణె నుంచి పూలు తెప్పించి ప్రత్యేకంగా అలంకరించారు.
కాగా, దాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. దీంతో తేజ్ ప్రతాప్ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 'మిస్ యూ పాపా' అని తన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
Miss you PAPA 😔
— Tej Pratap Yadav (@TejYadav14) April 18, 2018
నిశ్చితార్థానికి రాలేకపోయినా.. తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి వేడుకకు మాత్రం లాలూ పెరోల్పై వచ్చే అవకాశం ఉంది. మే 12న పాట్నాలోని ఓ కళాశాల మైదానంలో తేజ్ప్రతాప్- ఐశ్వర్యల వివాహం జరగబోతోంది.