టికెట్లు చెల్లవన్న గో ఎయిర్.. ఢిల్లీ ఎయిర్పోర్టులో తెలుగువారి పడిగాపులు..
ఢిల్లీ ఎయిర్పోర్టులో తెలుగు ప్రయాణీకులకు వింత అనుభవం ఎదురైంది. టికెట్లు బుక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధమైన ప్రయాణీకులకు గో ఎయిర్ షాక్ ఇచ్చింది. ప్యాసింజర్ల దగ్గర ఉన్న టికెట్లు చెల్లవని వారిని విమానంలో ఎక్కించుకునేందుకు నిరాకరించింది. దీంతో ఏం చేయాలో తెలియక ప్రయాణీకులు ఎయిర్పోర్టులో పడిగాపులు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రయాణికులు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. పేటీఎం ద్వారా పేమెంట్ చేసిన వారందరికీ టికెన్ కన్ఫర్మ్ అయినట్లు మెసేజ్ వచ్చింది. తీరా ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత వారి కష్టాలు మొదలయ్యాయి. వారు బుక్ చేసుకున్న టికెట్లు చెల్లవని చెప్పడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. ఒకే పీఎన్ఆర్పై వేర్వేరు పేర్లు ఉన్నాయని చెప్పిన గో ఎయిర్ వారిని ఎక్కించుకోకుండానే ఫ్లైట్ను హైదరాబాద్కు పంపేసింది.
గో ఎయిర్ ఫ్లైట్ టికెట్లు చెల్లవని చెప్పడంతో ప్రయాణీకులు ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ వ్యవహారంపై అటు పేటీఎం యాజమాన్యంగానీ, ఇటు గో ఎయిర్ సిబ్బందిగానీ స్పందించడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.