వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణంతీసిన చాటింగ్: మాంచెస్టర్లో తెలుగు విద్యార్థి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugu student dies in Manchester
మాంచెస్టర్: సమీప కిట్స్‌ గ్రోవ్‌ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఫోన్‌లో చాటింగ్‌ చేస్తూ సుజిత్‌ అనే 22 ఏళ్ల తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్ర యూనివర్సిటీలో మెటలర్జీ పూర్తి చేసి మాంచెస్టర్‌లో ఎంఎస్ చేయడానికి సుజిత్‌ క్రిందటి ఆదివారం యూకే చేరుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మాంచెస్టర్‌కు వెళ్లడానికి కిట్స్‌ గ్రోవ్‌ రైల్వే స్టేషన్‌లో ఎదురుచూస్తున్నాడు.

రైలు రావడానికి ఇంకా సమయం ఉండడంతో చేతిలో ఉన్న సెల్‌‌ఫోన్‌లో చాటింగ్‌ చేస్తూ అటు ఇటు నడుస్తూ ప్లాట్ ఫారం అంచులకు వెళ్లాడు. అదే సమయంలో వెనుకనుంచి రైలు వచ్చింది. దానిని సుజిత్ గమనించలేదు. అతి వేగంగా వస్తున్న ఆ రైలుకు అక్కడ స్టాప్‌ లేకపోవడంతో అది ఆగలేదు. అదే సమయంలో ప్లాట్‌ఫారమ్‌ అంచుల వద్ద ఉన్న సుజిత్‌ను రైలు ఈడ్చుకుపోయింది.

చదువుకోవాలనుకున్న విశ్వవిద్యాలయానికి చేరకముందే, ఆ దేశంలో దిగి ఇంకా ఒక్క రోజు కూడా గడవకముందే సుజిత్‌ చాటింగ్‌కు బలి అయ్యాడని కుటుంబం కన్నీరు మున్నీరయింది. ప్లాట్ ఫారంపై దొరికిన సుజిత్‌ బ్యాగ్‌ను బట్టి మాంచెస్టర్‌ పోలీసులు సుజిత్‌ గురించి తెలుసుకుని స్థానికంగా ఉన్న గార్డియన్‌ ద్వారా తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశారు. లండన్‌కు చెందిన స్థానిక తెలుగు సంస్థ సహకారంతో సుజిత్‌ మృతదేహాన్ని భారత్ పంపిస్తున్నారు.

English summary
Telugu student dies in Manchester.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X