బురారీ సూసైడ్ కేసు: ఆ ఇంటిని దేవాలయంగా మార్చాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ బురారీ కుటుంబం సామూహిక ఆత్మహత్యల కేసులో దర్యాప్తు చేసే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారు చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆ కుటుంబంలోని కొందరు వ్యక్తులు ఆత్మహత్యల కోసం స్టూల్, వైర్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఓ వీడియో వెలుగు చూసింది. ఆ తర్వాత, తాజాగా ఆత్మహత్యకు తానే ప్రేరేపించినట్లు గీతామా అనే మహిళ ముందుకు వచ్చింది.
ఇదిలా ఉండగా, 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఇంటిని ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ ఇంటిని ఆలయంగా మార్చాలని కొందరు స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. కుటుంబంలోని 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు భయానికి లోనవుతున్నారు.
దీనికి తోడు ఆత్మహత్య వెనుక కారణాలు మీడియాలో ప్రసారమవడం, పోలీసులు రోజూ ఆ ఇంటి వద్దకు వచ్చి వెళ్తుండటంతో వారంతా ఆందోళనకు చెందుతున్నారు. ఇప్పటికే ఆ ఇంటి చుట్టుపక్కల నివసించే చాలామంది భయంతో తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారట.
ప్రస్తుతం
నారాయణ్
దేవి
ఇంటిని
పోలీసులు
సీజ్
చేశారు.
దర్యాప్తు
తర్వాత
ఆ
ఇంటిని
ఎవరికి
అప్పగిస్తారన్న
దానిపై
స్పష్టత
రాలేదు.
అయితే
ఆ
ఇంటిని
ఆలయంగా
మార్చితేనే
మంచిదని
కొందరు
స్థానికులు
భావిస్తున్నారు.
ఆ
ఇంటిని
తీసుకోవడానికి
ఎవరూ
ముందుకు
రావడం
లేదు.
మరోవైపు,
మహిళా
మంత్రసాని
గీతామాను
పోలీసులు
అదుపులోకి
తీసుకున్నారు.