గుళ్ళలో హీటర్లు, వేడినీళ్ళతో అభిషేకం, ఎందుకంటే?
లక్నో:దేవుళ్ళకు కూడ చలి నుండి రక్షణ కల్పించేందుకు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గుడిలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవుళ్ళకు వేడి నీళ్ళనే ఉపయోగిస్తున్నారు. దేవాలయంలోని గర్భగుడిలో హీటర్లు కూడ పెట్టి చలి నుండి కాపాడుతున్నారు.
అసలే శీతాకాలం. సాధారణంగా దక్షిణాది ప్రాంతానికి చెందినవారే చలికి తట్టుకోలేకపోతున్నారు. అయితే అదే సమయంలో దేవుళ్ళకు కూడ చలి నుండి రక్షణ కల్పించాలని యూపీలోని పూజారులు వినూత్నంగా ఆలోచించారు.ఆలయ గర్భగుడిలో హీటర్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు దేవుడికి వేడి నీళ్ళతోనే అభిషేకం చేస్తున్నారు.
యూపీలోని జానకి ఘాట్ బడాస్థాన్ ఆలయంలోని గర్భగుడిలో హీటర్లు ఏర్పాటు చేసి దేవతా విగ్రహాలకు వేడి నీళ్లతో అభిషేకం చేయిస్తున్నారు.అయోధ్యలోని రమలల్లా విగ్రహానికి నూలు వస్త్రాలు తొడగాలని ఆలయంలో హీటర్లు పెట్టించాలని రెండు రోజుల క్రితం వీహెచ్పీ డిమాండ్ చేసింది. యాధృచ్చికమో, ఈ డిమాండ్ కారణమో కానీ బడాస్థాన్ ఆలయంలో హీటర్లు ఏర్పాటు చేయడం గమనార్హం.