వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాలుగు పడవల బోల్తా, 10 మంది మృతి, పలువురి గల్లంతు
దిస్పూర్: అసోంలోని గోల్పారా జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తుపాను దాటికి సబన్ నదిలో నాలుగు పడవలు బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు.
సబన్ నదిలో నిర్వహించిన పడవ పందేలను తిలకించిన 50 మంది నాలుగు పడవల్లో తమ ఇళ్లకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ ప్రమాదంలో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు .
గల్లంతైనవారు ఎంతమంది ఉంటారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.ఈ ఘటన గోల్పారా జిల్లాలో విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
English summary
Ten people drowned when four boats capsized in Sabon river during a severe storm in Assam's Goalpara district, a senior district administration official said on Monday.
Story first published: Monday, September 18, 2017, 23:48 [IST]