ayodhya verdict:అయోధ్యలో హైఅలర్ట్, 30 బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్స్ మొహరింపు
అయోధ్యలో వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సిటీలో ఉద్రిక్త నెలకొంది. అయోధ్యలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందనే సమాచారంతో 30 బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్లను మొహరించారు. ఈ నెల 17వ తేదీ లోపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
17వ తేదీ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ విమరణ చేస్తారు. అయోధ్య పిటిషన్లను గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించిన ఆ బెంచ్ తీర్పు ఇవ్వనుంది. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు పోలీసులు, భద్రతా సిబ్బంది సెలవులను కూడా రద్దుచేశారు. ఈ క్రమంలో అయోధ్యపై ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో 30 బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్లను రంగంలోకి దింపారు.
అంతేకాదు 12వ తేదీలోపు ధర్మశాలలో ఉంటున్న వారని తరలిస్తామని ఆదేశాలు జారీచేశారు. మంగళవారం ధర్మశాలలు ఖాళీ చేయాలన స్ష్టంచేశారు. 10వ తేదీన 300 సెక్యూరిటీ సంస్థలు రంగంలోకి దిగుతాయని పేర్కొన్నారు. అప్పటినుంచి అయోధ్యలోనే ఉంటారని స్పష్టంచేశారు.