కాల్పులు.: కాశ్మీర్లో ఉగ్రవాది, మరో ఐదుగురు మృతి
సోపియన్: భద్రతా బలగాల కాల్పుల్లో కాశ్మీర్లో ఓ ఉగ్రవాది, మరో నలుగురు మరణించారు. కాశ్మీర్లోని సోపియన్లో మొబైల్ వెహికిల్ చెక్పోస్టుపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తిప్పికొట్టే క్రమంలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
మరణించినవారిలో ముగ్గురు ఉగ్రవాది అనుచరులని, అయితే సైన్యం కాల్పుల్లో మరణించినవారు పౌరులని స్థానికులు అంటున్నారు. నాలుగో మృతుడు ఓ విద్యార్థి. అతని మృతదేహం వాహనంలో పడి ఉంది.
ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో దాడి జరిగిందని చెప్పారు. మరణించిన ఉగ్రవాదిని షాహిద్ అహ్మద్ దర్గా గుర్తించారు. అతని సోపియన్ నివాసి. అతని వద్ద ఓ ఆయుధం కూడా లభించింది.
మరణించిన ముగ్గురు మైదాన ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాదులు గానీ, మరణించిన ఉగ్రవాది అనుచరులై గానీ అయి ఉంటారని అంటున్నారు. సైన్యం సాధారణ పౌరులను కాల్చి చంపడం ఇది రెండవసారి అని స్థానికులు విమర్శిస్తు్నారు
ఈ ఏడాది జనవరిలో సైన్యం కాల్పులు ముగ్గురు మరణించినప్పడు నిరసనలు పెల్లుబుకాయి.