వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామాలో ఉగ్రదాడి.. సీఆర్పీఎఫ్ జవాన్లపై బాంబులతో విరుచుకుపడ్డ ముష్కరులు

|
Google Oneindia TeluguNews

జమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పుల్వామా మరోసారి వణికిపోయింది. జిల్లాలోని నేవా గ్రామంలోగల సీఆర్పీఎఫ్ క్యాంపుపై టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అసలే టెన్షన్ వాతావరణం కొనసాగుతుండగా, సడెన్ గా దాడి జరగడంతో అధికారులు అలర్టయ్యారు.

దాడికి సంబంధించి వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. పుల్వామా జిల్లాలోని నేవాలో సీఆర్పీఎఫ్ క్యాంప్ ను ధ్వంసం చేయడమే టార్గెట్ గా ముష్కర మూకలు ప్రయత్నించాయని, క్యాంప్ బయట బంకర్ లో గస్తీకాస్తోన్న జవాన్లపైకి పెట్రోల్ బాంబులతో దాడి చేశారని అధికారులు తెలిపారు. లక్కీగా జవాన్లెవరికీ పెద్ద గాయాలు కాలేదని, దాడి తీవ్రత కూడా తక్కువస్థాయిలోనే ఉందని చెప్పారు.

Terrorists hurled bombs at CRPF bunker in Pulwama

గతేడాది ఆగస్టులో జమ్మూకాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిననాటి నుంచి అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత ఐదు నెలల్లో పలు మార్లు టెర్రరిస్టులు దాడులకు యత్నించడం, వాటిని సెక్యూరిటీ బలగాలు తిప్పికొట్టం జరిగింది. దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలిస్తున్నామని, ప్రస్తుతానికి పరిస్థితి అంతా కంట్రోల్ లో ఉందని అధికారులు చెప్పారు.

English summary
Militants on Monday attacked a CRPF camp in Jammu and Kashmir's Pulwama. The militants lobbed a grenade at CRPF camp in Pulwama's Newa village
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X