కుప్పకూలిన 115 ఏళ్ల పురాతన వంతెన.. 100 అడుగుల లోతులో పడ్డ వాహనాలు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో 115 ఏళ్ల నాటి పురాతన వంతెన కూలిపోయింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. డెహ్రాడూన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గరి కంటోన్మెంట్ ప్రాంతంలోని పురాతన వంతెన శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు వంద అడుగుల లోతులో కిందకు పడిపోయాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదలావుంటే శిథిలాల కింద చాలా వాహనాలు చిక్కుకుపోయినట్లు సమాచారం. రెస్క్యూ టీమ్ తో పాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అదలావుంటే అక్కడి ముఖ్యమంత్రి ఇటీవలే కొత్త వంతెనకు శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అంతలోనే పాత వంతెన కూలిపోవడం గమనార్హం.