వరద భాదితులకు అండగా నిలిచిన బిగ్ బీ,
తన చుట్టు ఉన్న ప్రజలు ఏ అపద వచ్చినా తానున్నాంటూ ముందుకు వస్తాడు. ఎవ్వరు అడిగినా ,అడగకున్నా తనకు తోచిన సహాయం చేసేవారిలో ఒకరు బాలివుడ్ నటుడు,బిగ్ బీ అమితాబ్ బచ్చన్... అమితాబ్ ఎన్నో సామాజిక సేవల్లో పాల్గోనడమే కాకుండా ఆర్ధిక ఉదారతను చాటుకుంటాడు. బాధితులకు పెద్ద ఎత్తున సహాయం చేయడంలో ముందుంటాడు...
తాజాగా ఉత్తరాధితో పాటు ఈశన్య రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.. దీంతో లక్షాలాదీ మంది ప్రజలు ఉండడానికి అవాసాలు లేక నిరాశ్రుయులుగా రోడ్డుమీద పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీగ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నాడు. ఈశాన్య రాష్ట్రాల్లోని అస్సాం పెద్ద ఎత్తున వరద తాకిడికి గురికావడంతో ఆ రాష్ట్ర ప్రజలకు సహయం అందించేందుకుగాను అస్సాం రాష్ట్ర సీఎం సహాయ నిధికి రూ.51 లక్షల రుపాయలను విరాళంగా అందించారు.
కాగ బిగ్ ఇప్పటికే పలువురు రైతులకు ఉన్న అప్పులను చెల్లించడంతో పాటు పుల్వామా బాధిత కుటుంభాలకు సాయం అందించాడు. ఓక్కో జవాన్ కుటుంభానికి 5 లక్షల రుపాయాలు అందించి తన ఔదార్యాన్ని చాటుకున్న విషయం తెలిసిందే...