పార్టీ, రెండాకులు కోతుల చేతికి వెళ్లాయి, కోతి చేతికి చిప్ప ఇస్తే, సుప్రీం కోర్టుకు, మన్నార్ గుడి !
అన్నాడీఎంకే ప్రభుత్వం, పార్టీ కోతుల చేతికి వెళ్లిందికోతి చేతికి చిప్ప ఇస్తే ఎమౌతుంది, ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తాంసుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం, మన్నార్ గుడి మాఫియా ఫైర్, ఏం చేస్తారు ?
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం సొంతం కావడంతో చిన్నమ్మ శశికళ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నాడీఎంకే పార్టీ కోతుల చేతికి వెళ్లిందని, తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని శశికళకు మన్నార్ గుడి ఫ్యామిలీ అంటోంది.
గురువారం అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం తమిళనాడు ప్రభుత్వానికి చెందుతోందని భారత ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. భారత ఎన్నికల కమిషన్ ప్రకటనతో షాక్ కు గురైన శశికళ వర్గీయులు కొన్ని గంటలు మౌనంగా ఉండిపోయారు.
గురువారం సాయంత్రం చిన్నమ్మ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ మీడియా ముందుకు వచ్చారు. అమ్మ జయలలిత అధికారంలోకి తెచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం, ఆ పార్టీ రెండాకుల చిహ్నం కోతుల చేతికి వెళ్లిపోయిందని, కోతి చేతికి చిప్ప ఇస్తే ఎమౌంతుందో అందరికీ తెలుసని తీవ్రస్థాయిలో విమర్శించారు.
భారత ఎన్నికల కమిషన్ తీర్పును సవాలు చేస్తూ తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని టీటీవీ దినకరన్ చెప్పారు. అన్నాడీఎంకే పార్టీకి ఎప్పటికైనా తామే నిజమైన వారసులని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సందర్బంలో తమిళనాడు ప్రభుత్వం, సీఎం ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీద టీటీవీ దినకరన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.