వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ట్రిపుల్ తలాక్పై సుప్రిం కోర్టుకు వెళతాం... ముస్లిం లా బోర్డు
ట్రిపుల్ తలాక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదంపై ఆల్ ఇండియా ముస్లిం పెర్సనల్ లా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిన కొద్ది సేపటికే బోర్డు స్పందించింది. తాజా పరిణామాల నేపథ్యంలో 'న్యాయం' కోసం తాము సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.
కాగా ముస్లిం కుటుంబాలను విడగొట్టటమే బిల్లు ముఖ్య ఉద్దేశమని లా బోర్డు అభిప్రాయ పడింది. స్వభావరీత్యా ఇది నిరంకుశ బిల్లు అని, ముస్లిం మగవాళ్లను లక్ష్యంగా చేసుకున్నదని ఎఐఎండబ్ల్యూపీఎల్బీ గతంలోనూ తీవ్రంగా వ్యతిరేకించింది. కాగా, లోక్సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలోనూ ఇవాళ సాయంత్రం ఆమోద ముద్ర పడింది. బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 84 ఓట్లు పడ్డాయి. ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయగానే చట్టం రూపు సంతరించుకుంటుంది.
Comments
English summary
The All India Muslim Personal Law Board (AIIMWPLB) has decides that In the wake of the latest developments of Triple Talaq Bill. it is possible that they would go to the Supreme Court for ‘justice’.
Story first published: Tuesday, July 30, 2019, 21:09 [IST]