నెహ్రూ అతిపెద్ద రేపిస్టు...! విహెచ్పీ నేత వివాదస్పద వ్యాఖ్యలు
భారతదేశం అత్యాచారాలకు రాజధానిగా మారిందని ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్నిరేపుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలపై వీహెచ్పీ నేతలు తీవ్రంగా ఫైర్ అయ్యారు. సాధ్యీ ప్రాచీ అనే మహిళ నేత వివాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... భారత మొదటి ప్రధాని నెహ్రూ అతిపెద్ద రేపిస్టు అంటూ వ్యాఖ్యానించింది. "భారత దేశం రాముడు మరియు కృష్ణుడు పుట్టిన దేశమని.... అయితే రాహుల్ గాంధీ ఈ సంస్కృతికి మచ్చ తెచ్చెవిధంగా మాట్లాడరని ఆమె విమర్శించింది. ఈనేపథ్యంలోనే రాముడు మరియు కృష్ణుల సంస్కృతిని పాడు చేసిన నెహ్రూ అతిపెద్ద రేపిస్ట్ గా ఆమె అభివర్ణించింది."
తెలంగాణలో దిశ సంఘటన, యూపీలో ఉన్నావో ఘటనతో దేశం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది. దీంతో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో యూపీలో అధికార బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దీంతో దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం అత్యాచారాలకు రాజధానిగా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. దేశంలో జరగుతున్న రేప్ ఘటనలతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని ఆయన అన్నారు. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఓ చోట హత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
యూపిలో ఓ ఎమ్మెల్యే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నా... ప్రధాన మంత్రి మౌనంగా ఎందుకు ఉంటున్నారని అన్నారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ప్రధాన మంత్రి కనీసం ఒక్క మాట కూడ మాట్లాడడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే నేరుగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కోంటున్నా... ప్రధాని మాట్లాడడం లేదని ఆయన దుయ్యబట్టారు.