కూల్డ్రింక్స్లో మత్తుమందు ఇచ్చి.. అత్యాచారం చేసి... ఆ తర్వాత బ్రోతల్ హౌజ్కు పంపిణ వ్యాపారి
యువతికి నగరంలో ఎవరు లేనిది గమనించిన ఓ వ్యాపారి ఆమేకు పాతబకాయిలు ఇస్తానని పిలిచాడు.డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, కూల్డ్రింక్స్లో మత్తుమందు కలిపాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమేపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో వదిలిపెట్టకుండా ఆమేను బ్రోతల్ హౌజ్కు అప్పగించాడు. అపస్మారక స్థితి నుండి బయటపడిన ఆమే బ్రోతల్ హౌజ్నుండి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ముంబయినగరంలో చోటుచేసుకుంది.
ముంబాయి నగరంలో నాగ్పడా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే తన వద్ద పనిచేసే మహిళలకు డబ్బులు ఇవ్వకుండా కావాలనే డబ్బులు ఎగ్గోడతాడు..ఈ నేపథ్యంలోనే మహిళను పాత బకాయిలు ఇస్తానని చెప్పి సెప్టెంబర్ 2న తనకు పిలిపించాడు. అనంతరం ఆమేకు బాకి డబ్బులు ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడాడు. కూలుడ్రింక్ ఇచ్చాడు. అయితే అందులో మత్తుమందు కలిపిన విషయం తెలియని 27ఏళ్ల యువతి దాన్ని తాగడంతో మత్తగా ఉన్న యువతిని అప్పటికే అద్దెకు తీసుకున్న రూంలోకి తీసుకువెళ్లాడు. అనంతరం ఆమేపై దారుణంగా అత్యాచారానికి గురి చేశాడు. దాంతో ఆగకుండా ఆమేను ముంబాయి కామటిపురలోని ఓ బ్రోతల్ హౌజ్కు అర్ధరాత్రి అప్పగించాడు.
బ్రోతల్ హౌజ్లోకి చేరుకున్న యువతి అపస్మారక స్థితి నుండి తేరుకోవడంతో తాను ఎక్కడ ఉన్నానో అర్థమయింది.దీంతో అప్రమత్తమైన యువతి అక్కడి నుండి పారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు యువతిని వైద్యపరీక్షలకు పంపించారు. ఇక అక్కడి నుండి ఆమేకు బంధువులు ఎవరు లేకపోవడంతో మహిళల హస్టల్లోకి పంపారు. కాగా అత్యాచారానికి పాల్డడ్డ వ్యక్తితో పాటు అత్యాచారానికి పాల్పడ్డ రూం యజమానిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.